Tuesday, August 01, 2017

ఎవరా ప్రభువు?




ఆ.వె.
తండ్రికొడుకు లొక్క తరుణిని రమియింప
పుత్రు లిద్ద రొంది పోరు గలుగ
నొకని జంపి రాజ్య మొకని కిచ్చిన ప్రభు
వాతఁ డిచ్చు మనకు నఖిల సిరులు.

(‘
నానార్థ గాంభీర్య చమత్కారికగ్రంధం నుండి.)

సమాధానం
ఆ.వె.
తండ్రి కొడుకులైన తరణి యముల చేత
కర్ణ ధర్మజులను గనెను కుంతి
సమరమందు కర్ణుఁ జంపించి ధర్మజు
నవనిపతిగఁ జేసె హరియె గాదె.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card