Friday, June 28, 2019

మానసిక దిగంబరత్వం కోసం



కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు జవాబు చెప్పడం ఏమంత సులువు కాదు. మనసులో ఎగసిపడిన భావాలను చరణబద్ధంగా అక్షరాలలోని ఒంపే ప్రక్రియ అనుకోవచ్చునేమో! కాకపోతే రానురానూ మనసులో మెదిలిన ప్రతి ఒక్క భావాన్నీ ఏదో ఒకలా వదిలించుకుని, దానినే కవిత అని పేరు పెట్టుకునే పరిస్థితులు వచ్చేశాయి. తెలుగునాట కవిత్వం చదివేవారి సంగతేమో కానీ, కవుల సంఖ్య మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. సామాజికమాధ్యమాల ద్వారానో, చిన్నాచితకా సభల ద్వారానో ఉబికివస్తున్న స్వయంప్రకటిత కవుల తాకిడి ఎక్కువైపోయింది. కవిత్వంలో నిబద్ధత గురించి ఇలాంటివారికి ఓసారి గుర్తుచేయాలంటే దిగంబర కవులను తల్చుకోవాల్సిందే!

1960వ దశకంలో ఉవ్వెత్తున దూసుకువచ్చి ఇదిదిగంబరరశకం, నగ్ననామ సంవత్సరం, ఆశ రుతువుఅని సగర్వంగా చాటిన దిగంబర కవుల గురించి చెప్పుకొనేందుకు చాలానే ఉంది. నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండరాజు, జ్వాలాముఖి, భైరవయ్య, మహాస్వప్న
 అనే ఆరుగురు కవులే మనం తల్చుకున్న దిగంబర కవులు. వీరి అసలు పేర్లు ఇవి కావు.
సొంత పేర్లతో రాయకూడదనేది ఈ ఉద్యమంలో ఒక షరతు. ఆ మేరకు కమ్మిశెట్టి వెంకటేశ్వర్లు మహాస్వప్న కలం పేరు ధరించారు. మిగతావారిలో భాస్కరరెడ్డి చెరబండరాజుగా, కేశవరావు నగ్నమునిగా, వీరరాఘవాచార్యులు జ్వాలాముఖిగా, మన్మోహన్‌ సహాయ్‌ భైరవయ్యగా, యాదవరెడ్డి నిఖిలేశ్వర్‌గా కలాల పేర్లు పెట్టుకొన్నారు. మానసిక దిగంబరత్వం కోసం నిత్య సచేతన ఆత్మస్ఫూర్తితో జీవించడమే మా ఆశయం. శ్వాసించే ప్రతి వ్యక్తితో సారూప్యం చెంది, వ్యక్తి అస్థిత్వ పరిరక్షణ కోసం, అంతరంగంలో అణగిపడి ఉన్న ఆరాటాన్ని, ఆ సంతోషాన్ని, విసుగును, అక్షరాల్లో వ్యక్తీకరించి నూతన విశ్వాసాన్ని, ఆశను కలిగించాలని మా తత్పరత’’ అంటూ వారు సంకల్పం చెప్పుకొన్నారు.

ఈ ఆరుగురూ కూడా తమతమ లక్ష్యలకు ప్రతీకగా ఉండేందుకు నియమించుకున్న కలం పేర్లే కానీ కులం పేర్లు కావు. నిజానికి ఈ ఆరుగురూ అప్పటికే కవితాలోకంలో ఎంతో కొంత పేరు తెచ్చుకున్నవారు. అయితే నిస్తబ్దుగా ఉన్న కవితాలోకంలో ఏదో ఒక ప్రకంపన సృష్టించాలన్న తపనతో ఒక చోటకి చేరారు. అందుకోసం వారు uncensored గా తమ భావాలను వెలిబుచ్చుతూ మూడు సంకలనాలను తీసుకువచ్చారు.

తెలుగు కవిత్వాన్ని శాసించిన దిగంబర ఉద్యమ కవుల్లో ఒకరు, ప్రముఖ సాహితీవేత్త మహాస్వప్న (79) కన్నుమూశారు. నేను వస్తున్నాను దిగంబరకవినిఅంటూ దిగంబర కవిత్వోద్యమానికి శంఖారావం పూరించిన వారు మహాస్వప్న. కాలం వాయులీనం మీద కమానునై, చరిత్ర నిద్రాసముద్రం మీద తుఫానునైఅంటూ తన అద్భుత కవితాశక్తితో ఒక తరాన్ని ఆయన కదిలించారు మహాస్వప్న అసలు పేరు కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు.. వృతిరీత్యా వ్యవసాయదారుడు. ఆజన్మ బ్రహ్మచారిగానే జీవితాంతం గడిపారు.
ఆత్మయోని
నన్నయ్యను నరేంద్రుడి బొందలోనే
నిద్రపోనియ్యి
లేపకు
పీకనులిమి గోతిలోకి లాగుతాడు.
ప్రబంధాంగనల తొడలు తాడి మొద్దులు
తాకితే కాళ్ళు విరగ్గొట్టు
అంటూ సాగే కవిత్వంలో తమ ఉద్దేశం ఏమిటో కుండబద్దలుకొట్టేశారు దిగంబర కవులు.
దిగంబర కవిత్వం ఊహించినట్లుగానే ప్రకంపనలు సృష్టించింది. రా.రా, తిలక్, సోమసుందర్‌ వంటి ప్రఖ్యాతులు ఈ కవిత్వంలోని పదప్రయోగాలను నిరసించారు. ఇందులోని లైంగిక ప్రతీకలని, అశ్లీల పదాలనీ ఎండగట్టారు. కానీ శ్రీశ్రీ, చలం వంటి రచయితలు ఈ రచనలను నెత్తికెత్తుకున్నారు. ఉడుకురక్తపు యువకులు పదేపదే ఈ కవితలను చదువుకున్నారు. అణగారిన వర్గాలు దిగంబర కవిత్వాన్ని గుండెలకు హత్తుకున్నారు.
ఈ దేశంలో, ఈ గోళంలో ఊపిరిపీల్చే ప్రతి మనిషి ఉనికి కోసం తపనపడి, అతడి భావిని చూసి వెక్కి వెక్కి, పిచ్చెక్కి ప్రవచించిన కవితఅంటూ తమ కవితలను నిర్వచించారు. వారి కవిత్వం చదివితే అదెంత నిజమో అర్థమవుతుంది.

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681


Tuesday, June 25, 2019

“అకౌంటెంట్లు, న్యాయవాదులు మరియు సిఐలు చేతులు జోడించి ప్రార్దిస్తున్నాం”



"చివరికి ఒక రోజు మీరు అతిథిగా రానే వచ్చారు,
వస్తూ వస్తూనే మనమందరం ముందు ముందుఎలా ఉంటాం అనే వార్త తెచ్చారు "


ఆ రోజు, జూలై 1, 2017, మొదటి ఉదయం -బాగా గుర్తు తెచ్చుకోండి
మీరు మొదటిసారి వచ్చినప్పుడు,
ప్రతిచోటా మీరే,జనం నోటా మీరే
టీవీ, రేడియో లేదా వార్తాపత్రిక ఏమైనా. మీరే మీరే
అన్ని ప్రభుత్వాలు మీ ఆతిథ్యంలో తరించాయి
మేము కూడా ఆతిథ్యంలో వాటిని అనుసరించాము 


మీరు పరివర్తన క్రెడిట్ (Transitional credit) బహుమతులు ఇచ్చారు,
క్రొత్త దిశలు, కొత్త నియమాలు, కొత్త వ్యాపారం-,కొత్తకొత్తగా అంతా
అప్పుడే గుండె కొట్టు కోవటంలో కొత్త తేడా కూడా వచ్చింది ,


ఎవరెవరో వచ్చారు ఏదేదో వివరించారు, , విన్నంత విన్నాం,
తప్పుల్లేకుండా మీరు చేయలేరు అన్నారు నిజమే.ఇప్పటికీ అలాగే వున్నాం


మేమందరం R1, R2, 3B, ఫైల్స్ అంటూ ఆన్-లైన్ కి అతుక్కు పోయాం,
లేట్ ఫీ, ఇంటరెస్ట్ మరియు పెనాల్టీ అంటూ... మీ జేబులు నింపాము


ఎక్కడో విన్నాను, 10 వ విద్యార్థి కూడా దీన్ని చేయగలడు, అని
మీకు గుర్తుందా మేము CA / MBA/Bcom/ ఫైనాన్స్, అందుకేనేమో మావల్ల కావట్లేదు.


ఎంతో ఉత్సాహంగా, పోర్టల్‌లోకి ప్రవేశించాం .అంతే “జింతాక-జింతాక-జింతాక థ” కనపడింది.,
2 నిమిషాలు మాత్రమే పనిచేసి , ఆన్‌లైన్‌ కి , మా ఫేస్ కి మా ఎదురుచూపుల్తో లాక్ చేయబడింది
మీ సాఫ్ట్‌వేర్ మార్కెట్ వేడెక్కిన, వెంటనే
మాన్యువల్ ఎంట్రీలు, నగదు, నకిలీ అంటూ -అప్పుడే గందరగోళం మొదలయ్యింది


నియమాలు పై నియమాలను నిభందనలు మార్చారు – మాకు కొద్దిగా పిచ్చెక్కింది,
అకౌంటెంట్లు, న్యాయవాదులు మరియు సిఐలు తలోక వాట్సాప్ గ్రూపులకు ADD అయ్యాం. పూర్తి పిచ్చోళ్ళు అయ్యాం


మొదటి కానుకగా -PAPER-LESS GST లో PAPER కొంచెం తగ్గించబడింది
రామ రామా ! మాకు మాత్రం, A4 పేపర్ కట్టలు 2 రీమ్స్ పూర్తయ్యాయి.


ఆలస్య రుసుము తీసేసారు అని ఆనందించే లోపే,
RCM మరియు EWAY-BILL అంటూ రెండు CYCLON లు వచ్చాయి.
నోటిఫికేషన్ల తుఫానులు మన చుట్టూ ఎన్ని ఉన్నా
ఆకలి దాహం, లెక్కచేయకుండా శక్తి అంతా పోగుచేసి ధైర్యంగా పరిగెత్తాము .


లూప్-హోల్స్ వల్ల, అవకాశం ఉన్నవారంతా ప్రజల్ని దోచుకున్నారు.
మమ్మల్ని, మాత్రం బంధువులు, స్నేహితులు, అందరూ వదిలిపోయారు.
హోలీ, దీపావళి లాంటి అన్ని పండుగలు, ఇప్పుడు కల
GST HELPLINE మాత్రమే మాకు మిగిలింది –ఒకే ఒక ఆశ ...లా


ఇప్పుడు పనికే కాదు శెలవు కీ భయపడుతున్నాము
క్లయింటు కి, భయపడుతున్నాము- అధికార్లకి భయపడుతున్నాము
అంతర్జాలానికి భయపడుతున్నాము-అధీకృత సైటు కి భయపడుతున్నాము
భయం-భయం గా బతుకుతున్నాము - అందుకే రక్తం చెమట గా కారుస్తున్నాము


ఈ టైంలోనే కజిన్ వివాహానికిచ్చిన కార్డు గుర్తుకు వచ్చింది,
అంతలోనే అసిస్టెంట్ ఒక సమస్యతో వచ్చాడు,
చాలా గౌరవనీయమైన క్లయింటు ఫోన్‌లో ఉన్నారు,
వారి ఇన్‌వాయిస్లు 2-ఎలో తక్కువగా వున్నాయి,
ఫోన్ కత్తిరించి వేద్దమా? -నుదిటిపై దట్టంగా చెమట పట్టుకుంది,.
మెదడుని కూడా వజ్రం లా కత్తిరిస్తేనే మెరుస్తుందేమో


సెక్షన్ 42/43 - [ITC] -అంటూ, మీరు ఆనందాన్ని సగం లాక్కున్నారు
17 (5) –(Blocked Credits) అంటూ సమాజం మమ్మల్ని పూర్తిగా ‘బ్లాక్’ చేసింది


పరిస్థితి ఇప్పుడు షోలే సినిమా లో 'ఠాకూర్' లాగా ఉంది
ఏమీ చేయాల్సిన పని లేదు , వాటిని తట్టుకునే అలవాటు చేస్తే చాలు


అప్పుడప్పుడు ఆవేశంగా అనిపిస్తుంది, వెళ్లి కౌన్సిల్ని , కమిటీ ని నిలదీయాలని
పూర్తి సన్నాహాలు లేనప్పుడు, సెక్షన్ 49A {itc set -off ) ను ఎందుకు తీసుకురావాలి అని


తుఫాను ముందు కారుమేఘాల్లా వార్షిక రిటర్న్ – 9, 9A , 9C వచ్చాయి
మునుపటి గాయాలన్ని మళ్ళీ నెత్తురోడుతున్నాయ్.


ఎక్కడినుండి వచ్చాం,ఎక్కడికి వెళ్తున్నాం
హృదయం బరువెక్కింది , కళ్ళు తేమగా ఉన్నాయి
అకౌంటెంట్లు, న్యాయవాదులు మరియు సిఐలు చేతులు జోడించి ప్రార్దిస్తున్నాం,
జీఎస్టీ సులభం, చేయండి- సరళంగా చేయండి- సాధారణం చేయండి


“మేరా భారత్ మహాన్”
"జై హింద్, జై భారత్"

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681

Monday, June 24, 2019

ఆడిటర్ గా ఉండటం అంత సులభం కాదు


ఆడిటర్ సాధారణ వ్యక్తే, కానీ వారే దేవుడు కాదు
ఆడిటర్ అయితే జీవితం అంతా శాంతి ప్రశాంతి అనుకున్నాను
ఎన్నో సార్లు పుస్తకాలు చదువుతూ నే ఆ స్టడీ టేబుల్ పై నిద్రపోయా
పరీక్షల భయం ఇప్పటి వరకు వదిలిపెట్టలేదు


మేము క్రికెట్ బ్యాట్ వదిలాము, సినిమాలు,టీవీ రిమోట్ వదిలలాము
ఈ హోదా కొరకు మేము జీవితపు ఎన్నో ఆనందాలను విడిచిపెట్టాము
హోలీ ఎప్పుడు వెళ్లిపోయిందో తెలీదు ,దసరా ,దీపావళి వ ఎప్పుడు పోయిందో తేలీదు
సంక్రాంతి ,రక్షాబంధన్ ఎప్పుడు పోయింది, మా మణికట్టు బోసి పోయింది ,


మాకు ఆదివారాలు లేవు, పండగలు లేవుసెలవు కోసం అభ్యర్థన లేదు
తొలకరి జల్లు లేదు ఉన్నదల్లా చల్లని పొగమంచు లాంటి పని
గడిచిన రాత్రిలాగే వేలాది రాత్రులు అన్ని ఖాళీ
ఆడిటర్ గా ఉండటం అంత సులభం కాదు


మా కుటుంబం మాతో గడపాలని ఆరాటపడుతుంది
వారి కోరిక ఎప్పటికయినా నెరవేరుతుందా
మీరు సంతోషంగా కనిపించిన ప్రతిసారీ మాకు ఇబ్బంది లేదు
ఆడిటర్ గా ఉండటం అంత సులభం కాదు 


మీ అంచనాలను నెరవేర్చడం కోసం
మేము మా జీవితంలో ముప్పై సంవత్సరాలు గడిపాము
మీరు ప్రజలను అనుమానించి మీరు ఏదైనా వ్రాస్తే,
ఇప్పటికీ ప్రజలు మా దగ్గరకు రావడానికి భయపడుతున్నారు


మేము మోసపూరితంగా లేము. మేము గర్వపడుతున్నాము
మేము ప్రభుత్వం నుండి ఎంత మందిని రక్షించామో తెలుసుకోండి
మేము ప్రజలకు ఎంత పన్ను ఆదా చేశామో తెలుసుకోండి
ఆడిటర్ గా ఉండటం అంత సులభం కాదు


మా హార్డ్ వర్క్ అంటే ఆ పెన్ను తో వ్రాయటం,కంప్యూటర్ చూడడం అని మీకు తెలుసా
కానీ మీరు ఫీజుల పేరు చెపితే చాలుచల్లని నిట్టూర్పు తో వెళతారు.
మా పరిస్థితి గురించి ఆలోచించరు
ఆడిటర్ గా ఉండటం అంత సులభం కాదు


------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681
.

Sunday, June 23, 2019

Critical Observations in the current GST System

Critical Observations in the current GST System
1. GSTR1 is nothing but an ITC transfer form.
2. GSTR3B is a medium of extorting the late fees.
3. GSTIN is like a graveyard for a person working on GST.
4. GSTR9 is a tool to put taxpayers into the litigation.
5. GSTR9C is a nightmare to CA

Saturday, June 15, 2019

ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు .......

ఈమధ్య ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో నేను కాఫీ తాగటం అలవాటు గా మారింది.
మొన్నామధ్య ఉదయాన్నే నేను పేపర్ చదువుకుంటూన్నప్పుడు కాఫీ కలుపుకుని వచ్చి ఓ కప్పు నాకందిస్తూ
" ఏమిటోి ! జీవితం ఆనందంగా లేదు"అంది.మా ఆవిడ
ఆశ్చర్యంతో ఆమె వైపు చూశాను. ఆమెకు ఏమి లోటు ఉంది ?
"ఎందుకు అలా అనిపిస్తోంది?" అడిగాను
" అందరూ అంటారు నాకు అన్నీ ఉన్నాయి అని . కానీ ఎందుకో సంతోషంగా మాత్రం లేదు" ఆమె జవాబు
అదే ప్రశ్న నాకు నేను వేసుకుంటే నా జవాబు కూడా అలాగే అనిపిస్తోంది.
ఆలోచిస్తే కారణం ఏమీ కనిపించడం లేదు. కానీ నేను సంతోషంగా లేను
వెతకడం మొదలుపెట్టాను. ఎందరినో అడిగాను. సమాధానాలు తృప్తిని కలిగించలేదు
చివరికి నా మిత్రుడు - (డాక్టర్ కూడా) చెప్పిన సమాధానం నా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం ఇచ్చింది
ప్రపంచం లో అత్యంత ఆనందకరమైన వ్యక్తులయ్యేందుకు అవి మీతో పంచుకుందా మనిపించింది
మీ కోసం ఆ వివరాలు :
మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు
1. ఎండార్ఫిన్స్, Endorphins,
2. డోపామిన్, Dopamine,
3. సెరిటోనిన్... Serotonin,
4. ఆక్సిటోసిన్..... Oxytocin.

ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మనం సంతోషంగా ఉండడం ఎలాగో తెలుస్తుంది.
ఇవి మనలో ఉంటే మనం సంతోషంగా ఉండగలం
Endorphins: మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్స్ విడుదల అవుతాయి. ఈ Endorphins మన శరీరం లో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి
అప్పుడు మనం మన వ్యాయామాన్ని ఎంజాయ్ చెయ్యగలుగుతాము. అందుకు కారణం ఈ Endorphins

నవ్వడం వలన కూడా ఈ Endorphins ఎక్కువగా విడదల అవుతాయి. అందుకే యోగా లో హాస్యాసనం కూడా ఒక ఆసనం గా మన పూర్వీకులు నిర్ధారించారు. చివరిగా నవ్వడం అనే ప్రక్రియ నిర్వహిస్తారు.
"నవ్వడం ఒక భోగం - నవ్వలేకపోవడం ఒక రోగం" అన్నారు జంధ్యాల
ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ, హాస్య భరిత వీడియోలు చూస్తూ ఉండండి.
2. Dopamine:
నిత్య జీవితం లో ఎన్నో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో Dopamine హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెచుకోవడం వలన మనం ఆనందం గా ఉంటాము

ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన మీ ఆవిడలో డోపామిన్ స్థాయిని మీరు పెంచగలరు
ఆఫీస్ లో మీ పని మెచ్చుకుంటే మీ డోపామిన్ స్థాయి పెరుగుతుంది.
అలాగే కొత్త మోటార్ సైకిల్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు , కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీకు ఆనందం కలగడానికి కారణం ఈ Dopamine విడుదల కావడం
కాబట్టి మిత్రులారా !
షాపింగ్ బడ్జెట్ పెంచండి.
లేదా
పొగడడం నేర్చుకోండి. పైసా ఖర్చు కాదు కదా!
3. Serotonin: ఇతరులకు సహాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్
విడుదల అవుతుంది

మనం స్నేహితులకు , సమాజానికి మేలు చేకూర్చే ఏదైనా మంచి పని చేసినపుడు మనలో విడుదల అయ్యే ఈ Serotonin ఎక్కవగా విడుదల అవుతుంది
ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు ?
1. స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం
(వాళ్లకి ఆనందం కలగడం కోసం ... ఏమేమి కొత్తవి కొనుక్కున్నారో ఎంక్వయిరీ కోసం కాదు సుమా)
2. మొక్కలు నాటడం..
3. రోడ్ల గుంతలు పూడ్చడం
4. రక్త దానం..
5. అనాధ ప్రేత సంస్కారం..
6. అనాధ సేవ..
7. యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాల నిర్వహణ.
8. మంచివిషయాలు పేస్ బుక్ లో బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం
ఇవి అన్నీచేయ్యడం లో మన మన సమయాన్ని మన జ్ఞానాన్ని పంచుతున్నాము కనుక మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది
4. Oxytocin: ఇది నిత్య జీవితం లో మనం పెళ్లి అయిన కొత్తలో బాగా విడుదల అయ్యే హార్మోను. ఎవరిని అయినా మనం దగ్గరకు తీసుకునేటప్పుడు మనలో విడుదల అయ్యే హార్మోను. ఎదుటివారిలో కూడా విడుదల అవుతుంది
స్నేహితులను ఆలింగనం చేసుకోవడం వలన ఇది విడుదల అవుతుంది (ప్రేమికుల విషయం లో డోసు ఎక్కువ విడుదల అవుతుంది)
మున్నా భాయ్ లో " జాదూ కి జప్పీ" లాగ

అలాగే కరచాలనం
సినిమా ఆక్టర్ ని, రాజకీయ నాయకుడిని కరచాలనం చేస్తే మనం పొంగిపోయేది అందుకే !
గుర్తుకు తెచ్చుకోండి . మీ మొదటి స్పర్శను మీ బిడ్డను, మీ జీవిత భాగస్వామిని మొదటి సారిగా కౌగలించుకున్న మొదటి క్షణాలు.
ఇప్పటికీ మరపు రావు తలచుకున్న వెంటనే ఎంతో ఆనందం కలుగుతుంది
అలాగే మీ పిల్లలను దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా
అందుచేత
మన ఆనందం కోసం ప్రతిరోజూ ఇలా చెయ్యడం అలవాటు చేసుకుందాము
1.Endorphins కోసం రోజులో ఒక అరగంట నుండి గంట వరకూ కేటాయించి
వ్యాయామం చేద్దాము

2 .Dopamine కోసం చిన్న చిన్న లక్ష్యాలను సాధించి మనలను మనం పొగుడుకుంటూ Dopamine పెంచుకుందాము
మగవారికి ప్రత్యేకం
1. వంటను రోజూ మెచ్చుకోండి (నేను తిట్లు తినేది ఇందుకే)
2. డ్రెస్ మెచ్చుకోండి
3. మేకప్ మెచ్చుకోండి

ఆడవారికి ప్రత్యేకం
1. గుర్రు పెట్టారని తిట్టకండి
2. కూరలు తేలేదని చిరాకు పడకండి. కంది పచ్చడి చేసి పెట్టండి. సాంబార్ చెయ్యండి
3. మీ ఆయన్ను పొగడడం వలన మీకే లాభం అని గుర్తు పెట్టుకోండి
3. Serotonin కోసం మంచిపనులు చెయ్యడం నేర్చుకోండి. రోజుకు ఒక పది రూపాయలు ఇతరులకు ఖర్చు పెట్టండి గుడిలోదక్షిణ గానో, గుడి బయట బిచ్చగాళ్ళకు దానం గానో ఇవ్వండి
ఏడాదికి ఒక మొక్కను నాటండి.
ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలకో , సమాజ హితానికి జరిగే పనికో కొంచెం సొమ్ము ఇవ్వండి . అలాంటి పనులలో పాల్గొనండి
పైన అటువంటి వారి ఉదాహరణలు కొన్ని ఇచ్చాను కదా వారి కార్యక్రమాలను ఫాలో కండి
4. ఆక్సిటోసిన్ కోసం ఇంతో వాళ్ళని hug చేసుకుంటూ ఉండండి. పిల్లలు ఏడుస్తూ ఉంటె హాగ్ చేసుకుంటే వారికి సాంత్వన ఎందుకు కలుగుతుందో అర్ధం అయ్యింది కదా !
అలాగే ఇంట్లోవాళ్ళని , స్నేహితులనూ కూడా హగ్ చేసుకునే అలవాటు చేసుకోండి
ఇందులో ప్రమాదాలు ఎదురయ్యే పరిస్థితులు తెచ్చుకోకండి..
పిల్లలను హ్యాపీ గా ఉంచడం కోసం
1.గ్రౌండ్ కి వెళ్లి ఆడుకోనివ్వండి
-Endorphins

2. వాళ్ళు సాధించిన దానికి పొగడండి
-Dopamine

3. పంచుకునే తత్వాన్ని అలవాటు చెయ్యండి
-Serotonin

4. దగ్గరకు తీసుకోండి
-Oxytocin

Have A Happy Life..

Wednesday, June 12, 2019

ఎవడు కొడితే మైండ్ బ్లాంక్...



ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండు. పూరి జగన్నాథ్ సినిమాలోని ఈ డైలాగు తెలుగు నెలను ఒక ఊపు ఊపింది. ఇది అందరికీ తెలుసు కాని విషయం ఏమంటే ... చాలా మంది జీవితాల్లో ఇలా దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేట్టు చేసే పండుగాడు చాలా మంది జీవితాల్లో ఉంటారు. చివరకు ఆ డైలాగు రాసిన పూరి జగన్నాథ్ జీవితంలో కూడా ఉన్నాడు. పూరి జగన్నాధ్ చెప్పిన దాని ప్రకారమే అతని ఆర్థిక వ్యవహారాలు చూసే వ్యక్తే నమ్మించి దాదాపు వంద కోట్ల రూపాయల వరకు మోసం చేశాడట
ఇక్కడ పూరి జగన్నాథ్ గురించి చెప్పడం అంటే ఆయన వంద కోట్ల రూపాయలు పోయాయని సానుభూతితో కాదు. నిజానికి ప్రతి మనిషి జీవితంలో ఇలా మైండ్ బ్లాంక్ చేసే పండుగాళ్లు ఉంటారు అని చెప్పడానికే పూరి ఉదంతాన్ని ప్రస్తావించడం.
ఒక్క సినిమా రంగంలోని వారికే కాదు, ఏ రంగంలో ఉన్నా ఇలా మోసం చేసేవాళ్లు ఉంటారు. మోసపోయేవాళ్లు ఉంటారు. సంపాదించడమే కాదు సంపాదించిన డబ్బును మనం కోరుకున్నట్టుగా ఉపయోగించుకోవడం,జాగ్రత్త చేయడం కూడా మనకు తెలిసి ఉండాలి. లేకపోతే రోడ్డున పడతాం.
 పాత తరం నటులు ఇలా మోసాలకు గురైన చివరి దశలో తిండికి లేకుండా గడిపారు. హీరోయిన్‌గా, హాస్యనటిగా ఒక వెలుగు వెలిగిన గిరిజ చివరి దశలో తిండికి సైతం బాధపడ్డారు. భర్త చేతిలోనే గిరిజ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. ఆయన్ని దర్శకుడిగా నిలబెట్టడానికి సినిమాలు తీసి, భర్తమీద పెట్టుబడి పెట్టి రోడ్డున పడ్డారు.      

               ఇక్కడ తెలివితో సంబంధం లేదు. పూరి జగన్నాథ్‌కు తెలివి లేదు అందామా? తెలుగు సినిమా రంగంలో రికార్డులు సృష్టించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు ఆయన ఆయనకు తెలివి లేదని ఎలా అంటాం. అలానే అలనాటి పాత తరం నటులు ఎంతో మంది తెలివి లేకుండానే అంత ఉన్నత స్థాయికి వెళ్లారా? అద్భుతమైన తెలివి తేటలు, నైపుణ్యం ఉంటే తప్ప వీళ్లు తమ తమ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరరు.
                 ఐతే ఇదే సమయంలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన తెలివి తేటలు సైతం అవసరం.
              సినిమా వారి ఉదాహరణలు ఎందుకు అంటే వారి గురించి అందరికీ తెలుసు కాబట్టి. ఇలా స్నేహితులను నమ్మి నిండా మునిగిపోయిన వారు మన చుట్టుపక్కలనే ఎంతో మంది ఉండొచ్చు. మన బంధువుల్లో ఉండొచ్చు. డబ్బు కుండే లక్షణాలను తెలుసుకుంటే ఇలా మోసాల బారిన పడం. ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఉంటే అది ఆ ఇద్దరి వద్దనే చెల్లుబాటు అవుతుంది. ఇద్దరు బంధువుల మధ్య ఉండే బంధుత్వం ఆ ఇద్దరికే వర్తిస్తుంది. ఇద్దరు పెద్ద వారి మధ్య ఉండే స్నేహం మరో వ్యక్తి వద్ద అది పని చేయకపోవచ్చు. కానీ డబ్బు అలా కాదు. ఎక్కడైనా డబ్బు విలువ ఒకే రకంగా ఉంటుంది. నీ చేతిలో ఉన్నంత వరకే అది నీ డబ్బు. నీ వద్ద ఉన్నంత వరకే అది నీ మాట వింటుంది. నీ చేయి దాటి ఇంకొకరి వద్దకు వెళ్లిందనుకో... ఆ డబ్బు నిన్ను అస్సలు గుర్తు పట్టదు. నీ వైపు చూడదు. ఎవరి వద్ద ఉందో వారికే విశ్వాసంగా ఉంటుంది. వారి మాటే వింటుంది. డబ్బుకుండే ఈ లక్షణం అర్థం అయితే దానికి తగిన విలువ ఇస్తాం. మోసపోయాను, నమ్మించి మోసం చేశారు అనే మాటలు ఎవరి నుంచి వినిపించినా అది వారి అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడమే అవుతుంది. తెలివి తేటలతో డబ్బు సంపాదించాను అని భావిస్తున్నప్పుడు, అజ్ఞానం వల్ల ఆ డబ్బును కోల్పోయామని గ్రహించాలి.
ఇష్ట పూర్వకంగా నచ్చిన వారికి మీ డబ్బులు ఇవ్వడం వేరు. తెలివి తేటలు ఉపయోగించి, చమటోడ్చి సంపాదించిన మీ డబ్బుపై పెత్తనాన్ని అమాయకత్వంతో ఎవరికో అప్పగిస్తే రోడ్డున పడాల్సి వస్తుంది. చాలా మంది విషయంలో ఇలానే జరిగింది.
         ఒకసారి దెబ్బతిన్నతరువాత తిరిగి కోలుకోవడం అంత ఈజీ కాదు. వయసు సహకరించదు. కాలం కలిసి రాదు. మళ్లీ సంపాదిద్దాం అనుకుంటే అప్పటికి మీ ఆరోగ్యం, వయసు పరిస్థితులు అన్నీ మారిపోయి ఉంటాయి. కాలాన్ని వెనక్కి తిప్పలేం. డబ్బుల విషయంలో మన మైండ్ బ్లాంక్ చేసే అవకాశం ఎవరికీ కల్పించవద్దు. కాల్చడమే నిప్పు లక్షణం. డబ్బుకు స్నేహాలు, బంధుత్వాలు ఏమీ ఉండవు. ఎవరి వద్ద ఉంటే వారికి విలువ ఇవ్వడమే దాని లక్షణం. ఎంత త్వరగా ఈ లక్షణాన్ని అర్థం చేసుకుంటే డబ్బు విషయంలో అంత ప్రాక్టికల్‌గా ఉండడం అలవాటు అవుతుంది.

Saturday, June 08, 2019

భారతీయులు పన్నులు చెల్లించటానికి సాధారణంగా ఇష్టపడరు. ఎందుకు ?

భారతీయులు పన్నులు చెల్లించటానికి సాధారణంగా ఇష్టపడరు. ఎందుకు ?
   
ప్రియమైన మోడీజీ,

మన - కేంద్ర మరియు రాష్ట్ర , ప్రభుత్వాల గురించి మన  నిజాయితీగా ఉన్న పౌరులు,నిపుణులు & వ్యాపారవేత్తలు తరపున, నేను మీకు కొన్ని వాస్తవాలను పంపుతున్నాను ..

దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

ఎలాంటి దురదృష్టం .మేము టాక్స్ '' చోరి '' చేస్తున్నాం... అంటున్నారు అదినిజం  కాదు .మేము మా పన్ను ఆదా చేసాం (చాలా కొద్ది సందర్భాలలో  మాత్రమె ఎగ్గొట్టాం).
ఇది మా కుటుంబానికి భద్రత కల్పించడం కోసం, పిల్లలు మరియు వారి భవిష్యత్తు కోసం మాత్రమె...

1. మా గృహాలలో జనరేటర్లు / ఇన్వర్టర్లను కొనుగోలు చేసాము, ఎందుకంటే ప్రభుత్వం. స్థిరమైన విద్యుత్ను అందించడంలో విఫలమైంది.

2. మేము సబ్మెర్సిబుల్ పంపులను ఇన్స్టాల్ చేసాము, ఎందుకంటే Govt. నీటిని అందించడంలో విఫలమైంది.

3. మేము సొంత భద్రతా దళాలను నియమించుకున్నాము, ఎందుకంటే ప్రభుత్వం. భద్రతను అందించడంలో విఫలమైంది.

4. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి విద్యను అందించడంలో విఫలమైనందున మేము మా పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతాము.

5. మేము ప్రైవేటు ఆసుపత్రుల సరైన సంరక్షణ మరియు చికిత్సా సహాయాన్ని  ఖరీదు అయినప్పటికీ కొనుకున్నాం , ఎందుకంటే ప్రభుత్వం. మంచి ప్రభుత్వ ఆసుపత్రులను అందించలేకపోయింది.

6. మేము కార్లను కొన్నాము ఎందుకంటే ప్రభుత్వం. మంచి రవాణా అందించడంలో విఫలమైంది.

చివరగా .., పన్ను చెల్లింపుదారుడు తన విరమణ సమయంలో ఏమయినా తిరిగి పొందాలంటే లేదా మిగిలించు కోవాలంటే ముందు , అతను జీవించి ఉండటం చాలా అవసరం కదా?
మరి ఏంచేస్తాం, ఎక్కడా మాకు ప్రస్తుత  మరియు భవిషత్తు సామాజిక భద్రత లేదు.

మా కష్టార్జిత ఆదాయ వనరులను , అసలు పన్నులే చెల్లించని ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో రాయితీలు మరియు ఉచితాలు పంపిణీ చేసి -బదులుగా వారి నుండి"ఉచిత ఓట్లు" కొనటానికి ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది

పైవి అన్ని  కాక మా  (పన్ను) డబ్బు  తో ప్రభుత్వం ఇంకా  ఏమి చేస్తుంది ?

న్యాయస్థానాలు ఏర్పాటు ?-ఇవి సత్వర  తీర్పు ఇవ్వవు. కొన్నిసార్లు జీవితకాలం లేటు
పోలీసు స్టేషన్ను తెరిచి?-ఇవి రాజకీయవేత్తల కోసమే పనిచేస్తాయి, పౌరులను కాపాడటం మాత్రము కాదు.
హాస్పిటల్. కడతారా?-అరకొర వైద్యం తప్ప ఇవి మాకు బాగా చికిత్స చేయవు
రోడ్లు వేస్తారా..?- అవి  ఫలించవు. అవినీతి కారణంగా.ఖర్చు చేసిన డబ్బులో   40-100% డబ్బు దుర్వినియోగం అవుతుంది

ఇలా చెప్పుకుంటూ పొతే ఇది ఒక ఎండ్లెస్ జాబితా ...

ఒక తయారీదారు దాని ఖర్చు లు కవర్ చేసుకుని’  తన లాభం  2% నుంచి 10% మధ్యలో ఉండేలా పని చేస్తాడు, అయితే    ప్రభుత్వం  30% ఆదాయపన్ను అడుగుతుంది  ఇది ఎంత తేడాతో ఉంది?

మా నుండి సేకరించిన పన్ను ఆదాయం లో ఎక్కువ భాగం  ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయవేత్తలు వాడుకుంటున్నారు  (బిలియన్ డాలర్ల  డబ్బులు వారి విదేశీ బ్యాంకులు లో పడి ఉన్నాయి) అని తెలుసు.

పాశ్చాత్య ప్రజాస్వామ్యాల లాగా, పైన పేర్కొన్న సౌకర్యాలన్నీ , అన్ని ప్రభుత్వాలు  అందజేయగలిగితే, ఎవరైనా పన్నులు ఎందుకు సేవ్(చోరీ) చేస్తారు?

ఇది తన  సొంత విధులను నిర్వర్తించడంలో ప్రభుత్వ వైఫల్యానికి చిహ్నం. దీనికి ప్రభుత్వం మాత్రమే  బాధ్యత వహించాలి.
అందుకే ప్రభుత్వం సక్రమంగా పై వన్నీ చేసేవరకూ ఎవరూ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
మా అవసరాలు, మా కుటుంబము, మాకు వృద్ధాప్యము లో భద్రత, మా పిల్లల భవిష్యత్తు కొరకు మాత్రమె పన్నులని మేము సేవ్ చేస్తాము,

కానీ మరోవైపు...

భారతీయ సైన్యానికి  లేదా వరదలు లేదా భూకంప బాధితుల కోసం రూ .1000 కోట్లు అవసరం అని ప్రభుత్వం ప్రకటించినట్లయితే మేము సవాలు చేసి చెప్తాం  ఆ మొత్తాన్ని మా "పన్ను సేవకులు" మాత్రమే రెండు రోజుల్లో జమ చేస్తాము . ఇలాంటి వాటికి మేము సహృదయాలతో ముందుకు వస్తాము    .కాదంటారా?

నా ప్రియమైన స్నేహితులారా,
ఇది నిజం నిజం ... కాదంటారా....?

------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు@9441503681

Address for Communication

Address card