Saturday, October 08, 2016

ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు!



మనిషికి, మనిషి స్నేహితుడు (వెన్నంటి వుండేవాడు)
మరణం, మనిషికి స్నేహితుడు
కాలం, మరణానికి స్నేహితుడు
కాలానికి అందరూ స్నేహితులే

ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు!
వొక్కసారి పగలబడి ఏడ్చేస్తే లోపల వున్న దుఃఖమంతా అలల్ని యీడ్చి వొడ్డుకి కొట్టినట్టు వుండేదేమో! ఇవాళ (26.09.2016 )చనిపోయిన నా మిత్రుడు,పొన్నూరు లో ప్రముఖ హోమియో వైద్యుడు *డా|| రాతిక్రింద కోటేశ్వరరావు(బుజ్జి)*,నిడుబ్రోలు మరణం తో మనసులో కలిగిన అలజడిని ఎలా ఆపుకోవాలో తెలీక...
అప్పట్నించీ లోపలి సజీవమైన అవయవమేదో వున్నట్టుండి నిర్జీవమైపోయినట్టు- లేదూ- వొక వెలితి యింక దేన్తోనూ నింపడానికి వొప్పుకోనట్టు లేదూ- ఆ మరణపు వొక్క క్షణం అబద్ధమే అని యింకా అనుకుంటూ వున్నట్టుగా వుంది.
_“అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల
విశ్రాంతి గృహమ్ము, అందు ఇరు సంజెల రంగుల వాకిళుళ్ …….” _అన్న దువ్వూరి పద్యం గుర్తుకి వచ్చింది.
మరణాలు కొత్త కాదు. కానీ, ప్రతి మరణమూ కొత్తగా ఏడ్పిస్తుంది. అంతకు ముందు వెళ్ళిపోయిన మనుషులూ తక్కువ కాదు, కాని ఈ క్షణం వెళ్ళిపోయిన ఈ మనిషి యిలా వెళ్లి వుండకూడదనీ, మృత్యువు మరీ ఎక్కువ తొందరపెట్టి లాక్కు వెళ్ళిందనీ అనిపిస్తుంది

Sunday, September 11, 2016

'ప్రత్యేక వర్గం' హోదాను కలిగి రాష్ట్రాలు ఏ ప్రయోజనాలను పొందుతాయి

   'ప్రత్యేక వర్గం' హోదాను కలిగి రాష్ట్రాలు ఏ ప్రయోజనాలను పొందుతాయి
   
1.  ఎక్సైజ్ & కస్టమ్స్ , ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్ను,
సుంకాలు గణనీయమైన రాయితీని
    2. ప్రణాళిక వ్యయం (కేంద్ర బడ్జెట్) లో 30 శాతంగా 'ప్రత్యేక వర్గం' రాష్ట్రాల కి వస్తాయి
    3. 
సాధారణ సెంట్రల్ సహాయము
( NCA) యొక్క లబ్ధి. ఈ రాష్ట్రాలు NCA పరంగా మరిన్ని నిధులు పొందడానికి మరియు ఈ నిధుల చాలా భాగం రుణాలకి (loans) బదులుగా నిధుల (grants) రూపంలో పొందడానికి అవకాశం ఉంది.
    4.
  ప్రత్యేక కేంద్ర సహాయం
(SCS) ఇచ్చిన అదనపు మొత్తం కూడా ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక వర్గం' రాష్ర్టం ఉపయోగించవచ్చు ఇది ఒక అదనపు అవకాశం
   
5.   కేంద్ర
అన్ని ప్రాయోజిత పథకాలు మరియు బాహ్య సహకారం  (గ్రాంటు )ల లో కేంద్ర సహకారం 90% కలిగి మిగిలిన 10% రాష్ట్ర వ్యయం రాష్ట్రానికి రుణంగా ఇస్తారు. అదే మామూలు రాష్టాల క అయితే (జనరల్ కేటగిరీలో), రుణ నిష్పత్తి 30:70 ఉంది.
   
6.ఆ ఆర్ధిక సంవత్సరం లో ఖర్చుకాని డబ్బు తర్వాత సంవత్సరం కి తీసుకు రావచ్చు(brought over)

    
అందువల్ల, ప్రత్యేక వర్గం స్థితి కలిగిన రాష్ట్రాలు  దేశంలోకి
ప్రైవేటు పెట్టుబడులు catalyses , ఉపాధి మరియు రాష్ట్ర అదనపు రాబడిని ఆర్జిస్తుంది. కేంద్ర ప్రాయోజిత పథకాల మీద వ్యయం 90% కేంద్ర  భరిస్తుంది కాబట్టి  రాష్ట్రము  పొదుపు నుండి మరింత కొత్త  సంక్షేమ ఆధారిత పథకాలు పట్టవచ్చు.ఇంకా, కేంద్రం నుంచి వచ్చే మరింత నిధులు రాష్ట్ర నిర్మాణ మరియు సామాజిక రంగ ప్రాజెక్టులు నిర్మాణంపై సహాయపడుతుంది. ఫలితంగా, ప్రత్యేక వర్గం రాష్ట్ర దాని అభివృద్ధి లోటు త్వరగా పూడ్చుకునేందుకు ఆవకాశం వుంది.

Thursday, August 18, 2016

IDS అంటే ఏమిటి


income Dis-closer scheme అనగా
మనం ఇంతవరకు బహిర్గతం చేయని ఆస్తులు మరియు బ్యాంకు లావాదేవీలు ప్రభుత్వానికి తెలియచేసి వాటికి చట్ట భద్దత కల్పించే అవకాశం .
ఇది ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు దాదాపు 10 సార్లు ప్రకటించారు.కానీ ఇంతకుముందు ప్రకటించిన వాటికి దీనికి తేడా వుంది.ఇంతకుముందు వచ్చిన అన్నీ G.O ల్లో కూడా voluntary declaration అన్నారు.కానీ ఈ G.O లో మాత్రం income declaration అన్నారు. ఆ వొక్క పదానికి scheme స్వరూపమే మారిపోయింది
ఇంతకుముందు వాటిల్లో మీరు ఇష్టపడి స్వచందంగా వెల్లడించారు.లేకపోతె లేదు.కానీ
ఈ సారి అలా కాదు తప్పనిసరిగా వెల్లడి చేయాల్సిందే.
మీకుతెలుసు ఇప్పుడంతా online trend.దాదాపు 32 మార్గాలు ద్వారా వారూ మన ఆర్ధిక లావాదేవీలు గమనించిన తర్వాత అనుమానస్పద లావాదేవీల వివరాలని తెలియ చేయమని మనకి నోటీస్ ఇవ్వవచ్చు .అప్పుడు మనం తప్పనిసరిగా వారు సంతృప్తి పడే లాగ అన్ని వివరాలని డాక్యుమెంట్లు రూపంలో ఇవ్వాలి.
అసలు చిక్కంతా ఇక్కడనుంచే మొదలవున్తుంది.ఈ స్కీములో వారు ముందా మనం ముందా అనేది ప్రధానమయిన పాయింట్. మనమే వారు అడగకుండానే తెలియచేస్తే వకరకమయిన టాక్స్ కట్టాలి.(సుమారు 45% టాక్స్ కాస్త ఎక్కువయినా,చాలా ఉపయోగాలున్నాయి.మీకు ఆ డబ్బు ఎక్కడనుంచి,వచ్చింది,దాన్నిఎలా మార్చారు,దానికి ముందు తర్వాత ఆదాయం ,పెట్టుబడి,మదుపు లాంటి వివరాలన్నిఏ స్తాయి అధికారి గాని,మరేఇతర డిపార్ట్మెంట్ అధికారి గాని అస్సలు అడగరు.మిగిలిన వాటిగూర్చి తర్వాత మాట్లాడుకుందాం.).
వారు అడిగిన తర్వాత మీరు తెలియచేస్తే ఎంత కట్టాలో వారు నిర్ణయిస్తారు
( మీకు ఆ డబ్బు ఎక్కడనుంచి,వచ్చింది,దాన్నిఎలా మార్చారు,దానికి ముందు తర్వాత ఆదాయం ,పెట్టుబడి,మదుపు లాంటి వివరాలన్ని తప్పనిసరిగా టాక్స్ ని ప్రభావితం చేస్తాయి దీనికి అదనంగా జయిలుశిక్షలు,పెనాల్టిలు వున్నాయి)
అయితే మీఅంతట మీరు ఎప్పడో తీరిక చేసుకుని, వాళ్ళని వీళ్ళని అడిగి నిదానంగా చేద్దాం అంటే కుదరదు.అప్పటిదాకా వారుచూస్తూ ఊరుకోరు వారిపని వారు చేస్తుంటారు.ఇప్పటికే చాలామందికి నోటీస్లు వచ్చాయి.దీనికిమనకి ఉన్న గడువు ఆఖరి తేది 31.09.2016. వకవేళ మీకు ఇప్పటికే నోటీస్ వచివుంటే.అది IDS కిందా లేదా మమూలుగ ITO గారినుంచా తెలుసుకోవాలంటే,ఆ నోటీస్ వెనుక వైపు క్రింద త్రిభుజాకారంలో IDS సింబల్ వుంటుంది చూసుకోవచ్చు.



Sunday, August 07, 2016

ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టికెళ్లే 10 లావాదేవీలు



స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు
 రూ. 30 క్షకు మించి విలువ లిగిన స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం సంబంధిత లావాదేవీలను ఆదాయపు న్ను శాఖ అధికారులకు తెలియజేస్తారు.

వృత్తి నిపుణులు
 వృత్తి నిపుణులు సాధారణంగా దు రూపంలోనే లావాదేవీలు రుపుతూ ఉంటారు. రూ. 2 క్షకు పైబడి స్తు, సేవకు సంబంధించి తీసుకునే రుసుములను, రిపే దు లావాదేవీలను వృత్తి నిపుణులు ఆదాయపు న్ను శాఖకు వెల్లడించాలి.

బ్యాంకు దు డిపాజిట్లు
 ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో ఒక వ్యక్తి రూ. 10 క్ష కంటే ఎక్కువ మొత్తాన్ని ఏడాది కాలంలో డిపాజిట్ చేసి ఉంటే వివరాలను ఆదాయపు న్ను శాఖకు తెలియచాలి.

ర్మ్ డిపాజిట్లు
ఒక వ్యక్తి బ్యాంకు ర్మ్ డిపాజిట్లలో ఏడాది కాలంలో రూ. 10 క్ష కంటే ఎక్కువ బ్బు పొదుపు చేసి ఉంటే బ్యాంకులు మాచారాన్ని ఆదాయపు న్ను శాఖకు అందించాలి. వీటిలో పోస్టాఫీసు ఖాతాల్లో చేసిన డిపాజిట్లు, విత్డ్రాయల్స్ సైతం ఉంటాయి.

రెంట్ ఖాతా డిపాజిట్లు
 ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 క్షకు మించి చేసే దు డిపాజిట్లు, విత్డ్రాయల్స్ వివరాలను ఆదాయపు న్ను శాఖ సేకరిస్తుంది. ప్రతి లావాదేవీని స్వచ్చందంగా తెలియజేస్తే నోటీసులు చ్చే ఇబ్బందులు ప్పుతాయి.

బ్యాంకు డ్రాఫ్ట్లు
 బ్యాంకు డ్రాఫ్ట్ లేదా ఏదైనా ఆర్బీఐ జారీ చేసే ప్రీపెయిడ్ గదు సాధనం కొనుగోలు కోసం రూ. 10 క్షలు వెచ్చించి ఉంటే వివరాలు ఆదాయపు న్ను శాఖకు బ్యాంకు ద్వారా వెళతాయి.

ఫైనాన్సియల్ సెక్యూరిటీస్
 ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిలో రూ. 10 క్షకు మించి పెట్టుబడులు పెట్టి ఉంటే ఆయా కంపెనీలు లావాదేవీలను ఆదాయపు న్ను శాఖకు నివేదించాల్సి ఉంది.

క్రెడిట్ కార్డు చెల్లింపు
 రూ. 2 క్షకు మించి చేసే క్రెడిట్ కార్డు చెల్లింపు వివరాలు ఆదాయపు న్ను శాఖకు నివేదించతాయి.

బంగారు ఈటీఎఫ్లు
బంగారు ఈటీఎఫ్ల్లో ఒక వ్యక్తి రూ. 1 క్షకు మించి చేసే పెట్టుబడి వివరాలు ఆదాయపు న్ను శాఖకు దృష్టికి వెళతాయి.

మ్యూచువల్ ఫండ్లు, షేర్లు
 రూ. 2 లక్షకు మించి ఒక పెట్టుబడిదారు మ్యూచువల్ ఫండ్లు యూనిట్లను కొనుగోలు చేస్తే న్ను రిటర్నులను ఫైల్ చేసేటప్పుడు ఆదాయపు న్ను శాఖకు వెల్లడించాలి. కంపెనీలే ఈక్విటీ షేర్లలో రూ. క్షకు మించి పెట్టుబడులను ఆదాయపు న్ను శాఖకు వెల్లడిస్తాయి. ఆదాయపు న్ను శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ ఫైలింగ్లో 61 ఫారం ద్వారా అధిక విలువ లిగిన లావాదేవీలను తెలియజేయాల్సి ఉంటుంది.






Address for Communication

Address card