Sunday, August 17, 2014

అది అలనాటి ద్వారకే

నల్లనివాడు.. పద్మనయనమ్ములవాడు.. కృపారసంబు పైజల్లెడువాడు.. మౌళి పరిసర్పిత పింఛమువాడు.. నవ్వు రాజిల్లెడు మోమువాడు.. అని పోతన కమనీయంగా వర్ణించిన కృష్ణుడు.. నిజంగా ఉన్నాడా? అదిగో ద్వారక.. ఆలమందలవిగో.. అని అద్భుతంగా వర్ణించిన ద్వారక ఒకప్పుడు నిజంగా వర్ధిల్లిందా? పురావస్తు శాస్త్రం.. ఖగోళ శాస్త్రం.. ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి. కృష్ణుడి గాథలు ఒట్టి పుక్కిటి పురాణాలు కావని.. ఆ నల్లనయ్య చారిత్రక పురుషుడేనని ఽద్రువీకరిస్తున్నాయి.
‘‘జోరుగా విరుచుకుపడుతున్న సముద్ర కెరటాలు చెలియలికట్ట దాటాయి! సాగరజలాలు పోటెత్తి నగరంలో ప్రవేశించాయి. సుందరమైన ఆ ద్వారకాపురి వీధులగుండా పరవళ్లు తొక్కాయి. అడ్డొచ్చిన ప్రతి కట్ట డాన్నీ ముంచెత్తాయి. ద్వారకను సముద్రుడు కబళిస్తున్న ఆ దృశ్యాల్ని అర్జునుడు నిర్వికారంగా చూస్తున్నాడు. తనకు అత్యంత ఆప్తుడైన శ్రీకృష్ణుడు నివసించిన భవనాన్ని ఆఖరుసారిగా చూశాడు. ఇంతలోనే సముద్రపు నీరు ఆ భవనాన్నీ తనలో కలిపేసుకుంది. ద్వారక సాగర గర్భంలో మునిగిపోయింది. శ్రీకృష్ణుడు ఏలిన ఆ మహానగరపు ఆనవాళ్లు కనిపించకుండాపోయాయి. అది ఇప్పుడో పేరు... ఓ జ్ఞాపకం మాత్రమే.’’
..మహాభారతంలోని మౌసల పర్వంలో ద్వారకాపురి జలమయమైన దృశ్యాలను కళ్లకుకట్టే ఘట్టమిది. ఇదంతా నిజంగా జరిగిందా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని 1980ల్లో చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (గోవా)కు చెందిన మెరైన్‌ఆర్కియాలజీ విభాగం శాస్త్రవేత్త డాక్టర్‌ ఎస్‌.ఆర్‌.రావు నేతృత్వంలోని పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. సముద్రగర్భంలో ఒక మహానగరం అవశేషాలను గుర్తించారు. గుజరాత్‌లోని లోథాల్‌ రేవు పట్టణాన్ని, పలు హరప్పన్‌ నాగరికత ప్రాంతాలనూ కనుగొన్న ఘనత ఆయనది. 1999లో విడుదలైన ఆయన పుస్తకం ‘ద లాస్ట్‌ సిటీ ఆఫ్‌ ద్వారక’లో తాము కనుగొన్నది ఆ నల్లనయ్య ఏలిన ద్వారకనేనని విస్పష్టంగా పేర్కొన్నారాయన. ‘‘భారతదేశ చరిత్రలో ఆ ఆవిష్కారం అత్యంత కీలక మైలురాయి. మహాభారతం, ద్వారక నగరాల చారిత్రకత పై చరిత్రకారుల అనేక సందేహాలను తీర్చేసిందది’’ అని పేర్కొన్నారు. 1983 నుంచి 1990 నడుమ 12సార్లు వారు జరిపిన అన్వేషణలో సముద్రగర్భాన రెండు జనావాసాల అవశేషాలు వెలుగుచూశాయి. అందులో ఒకటి నేటి ద్వారక సమీపంలో కనిపించగా.. మరొకటి సముద్రం మధ్యలోగల నేటి బేట్‌ ద్వారకకు దగ్గరగా ఉంది. వారు కనుగొన్న అవశేషాల్లో అత్యంత కీలకమైనది.. ద్వారకానగరవాసులు అప్పట్లో ఎప్పుడూ తమవద్ద తప్పనిసరిగా ఉంచుకునేవారని చెప్పే ముద్ర (ఐడెంటిటీకార్డు లాంటిది) ఒకటి. మూడుతలల జీవి చిత్రం ఉండే ఆ ముద్ర లేని వ్యక్తులు ద్వారకలోఅడుగుపెట్టకూడదని కృష్ణుడు శాసించి నట్లు ‘హరివంశం’ చెబుతోంది. అలాంటి ముద్ర కలిగిన రాయి ఒకటి ఎస్‌.ఆర్‌.రావు బృందం అన్వేషణలో బయల్పడింది. ఇక నాసా మాజీ శాస్త్రవేత్త, గణితశాస్త్ర నిపుణుడు అయిన ఎన్‌.ఎస్‌.రాజారామ్‌ తన ‘సెర్చ్‌ ఫర్‌ ద హిస్టారికల్‌ కృష్ణ’ పుస్తకంలో.. హరప్పా నాగరికతకు చెందిన కొన్ని ముద్రలపై శ్రీకృష్ణుడి సమకాలికుల పేర్లు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయా ముద్రల్లో పైల (వేదవ్యాసుడి విద్యార్థి), అక్రూర (కృష్ణుడి స్నేహితుడు), యదు, శ్రీతీర్థ (ద్వారక ప్రాచీన నామం) వంటి పేర్లు ఉన్నట్టు.. ఆయన వివరించారు.
సముద్రం ఇచ్చిన భూమే..
పదేపదే దాడులు చేస్తున్న శత్రువుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు శ్రీకృష్ణుడు తన రాజధానిని మధుర నుంచి మరొక నగరానికి మార్చుకోదల్చాడు. శత్రుదుర్భేద్యమైన నగరాన్ని నిర్మించి ఇవ్వాల్సిందిగా విశ్వకర్మను కోరాడు. దానికి ఆయన 12 యోజనాల భూమి ఇస్తే నగరాన్ని నిర్మిస్తానన్నాడు. అప్పుడు సముద్రుడు ద్వారక ఉన్న ప్రాంతంలో 12 యోజనాల మేర వెనక్కి తగ్గి భూమిని ఇచ్చాడని.. మళ్లీ కొన్నేళ్ల తర్వాత శాపవశాన యాదవులందరూ అంతమైపోయినప్పుడు సముద్రుడు అంతకు ముందు తానిచ్చిన 12 యోజనాల మేర భూమినీ ఆక్రమించాడని పురాణ ప్రతీతి. ఇందుకు నిదర్శనమా అన్నట్టు.. ఎస్‌.ఆర్‌.రావు బృందం సముద్ర గర్భాన కనుగొన్న అవశేషాల తాలూకు కట్టడాల గోడలు.. సముద్రపుటొడ్డున ఉండే గండశిలలపై నిర్మించినట్టు వారి అన్వేషణలో తేలింది.

ఖగోళ శాస్త్రంలో..
అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ మెంఫిస్‌కు చెందిన భౌతిక శాస్త్ర ఆచార్యుడు డాక్టర్‌ నరహరి ఆచార్‌ 2004-05లో.. అప్పటి గ్రహగతుల ఆధారంగా కాలంలో వెనక్కి లెక్కలు కట్టి మహాభారత యుద్ధం జరిగిన తేదీని లెక్కగట్టారు. ఆయన లెక్క ప్రకారం మహాభారత యుద్ధం జరిగింది క్రీస్తు పూర్వం 3067లో. అదే సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఆయన శ్రీకృష్ణుడి జనన సంవత్సరాన్ని క్రీ.పూ.3112గా తేల్చారు. యూకేకు చెందిన న్యూక్లియర్‌ మెడిసిన్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ మనీష్‌ పండిట్‌.. ఖగోళ, పురావస్తు ఆధారాలను పరిశీలించి డాక్టర్‌ ఆచార్‌ చెప్పిన లెక్కలు సరైనవేనని ఆయనతో ఏకీభవించారు. మహాభారతంలో వేద వ్యాసుడు పలు సందర్భాల్లో అప్పటి గ్రహగతులకు సంబంధించిన సమాచారాన్ని 140సార్లు ప్రస్తావించారని మనీష్‌ పండిట్‌ చెబుతారు. జ్యోతిష్కుడు కూడా అయినా డాక్టర్‌ పండిట్‌.. ఈ సమాచారం ఆధారంగా కృష్ణుడి చారిత్రకతను నిర్ధారిస్తూ పలు పుస్తకాలు రచించారు. ‘కృష్ణ: హిస్టరీ ఆర్‌ మిత్‌?’ అనే డాక్యుమెంటరీ తీశారు. అయితే.. పలువురు చరిత్రకారులు మాత్రం కృష్ణుడి చారిత్రకతను కొట్టిపారేస్తారు. మధుర ప్రాంతంలో క్రీ.పూ 200 నుంచి క్రీ.శ.300 మధ్యకాలం నాటివిగా భావిస్తున్న పలు శాసనాలు, శిల్పాల అవశేషాలు దొరికాయని, వాటిలో ఏ ఒక్కదాంట్లోనూ కృష్ణుడి ప్రస్తావన లేదు కాబట్టి కృష్ణుడు పురాణ పురుషుడు తప్ప చారిత్రక పురుషుడు కాదని వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా... భక్తులకు మాత్రం కృష్ణుడు ఇలపై నడయాడిన దేవుడు... అంతే!!

Who is required to file Income Tax return

Who is required to file Income Tax return

  1. Every Company (Whether earn profit or loss)
  2. Every Firm (whether earn profit or loss)
  3. Individual /HUF/AOP/BOI or artificial Judicial person if Total Income plus Deduction under chapter VIA(Section 80C to 80U) ,exemption under section 10,10B,10BA is than maximum amount which is not chargeable under Income Tax Act.
  4. Other :If income more than maximum amount which is not chargeable under Income Tax Act.

Income Tax Return Due Date FY 2013-14
Sr no Particulars Due date
1 For such corporate assessees which is required to furnish a report u/s 92E(transfer pricing) of the Income Tax Act, 1961 30.11.2014
2 For all other Corporate assessees 30.09.2014
3 For non corporate assessees, (Like Partnership Firm ,prop Firm) whose accounts are required to be audited under Income tax act (Like 44AB turnover is more than 100 lakh in case of business and 25 lakh in case of profession- section 44AB and Business where disclosed profit is less than 8% of the turnover -Section 44AD)
(year wise audit limit 44AB is available here)
or any other act for the time being in force.
30.09.2014
4 For working partners of Partnership firms covered under sr no (3) above 30.09.2014
5 For any other assessees Like Salaried Income ,Person having Income from House property ,Interest income , Business Income where accounts are not required to be audited . 31.07.2014
Qus : If the last date of filing falls on Saturday or Sunday or Public Holiday and Income Tax Department is closed on these days, can subsequent Monday be treated as "Last date of Filing"?
Answer: Yes, if Income Tax Department is closed on these days. Otherwise, No.
Qus : Is it mandatory to file return of income after getting PAN?
Answer: No. The liability to file return of income arises only when you total Income is more than exemption limit without deduction u/s 80C to 80U and section 10A and 10B ,section 10BA.
Qus : Who can file the return for a deceased assessee?
Answer: A legal heir can file the return in such case.
Revised return {section 139(5)}: Return Filed with in due date can be revised any time before completion of assessment subject to maximum by the expiry of one year from the end of the relevant assessment year. For Financial year 2013-14 ,if return is filed with in due date then it can be revised by 31.03.2016.
Belated Return {section 139(4)} :Every assesse Can file their belated return with in one year from the end of the assessment year relevant to previous year or before completion of assessment u/s 142(1) . For Financial year 2013-14(AY 2014-15) belated (late) return can be filed by 31.03.2016 (i.e one year from end of assessment year 2014-15 ending 31.03.2015)
Consequences of Belated (late) return Filing :

  1. No revision :Late (belated ) return Can not be revised.
  2. Loss can not be carried forward :If any person file late return ,who has sustained a loss in any previous year under the head following head , can not carried forward losses to next year.

  • "Profits and gains of business or profession" or
  • under the head "Capital gains"
Penalty :If return is filed after end of assessment year (after 31.03.2015 in case of return of Fy 2013-14) then assessing officer may impose penalty up to Rs 5000/- under section 271F
Interest :Interest Under section 234A @ 1 % per month applicable on Net outstanding Tax due amount . Other Related Points.

  1. No return If Gross Total Income Less than exemption Limit :No Income Tax Return Return required to be filed If Gross Total Income is less than the Exemption Limit (Income before deduction u/s 80C to 80U and section 10A and 10B ,section 10BA )
  2. Mandatory Return for Firm and Company: Every company and Partnership Firm have to file Income tax return of their Income or Loss.
  3. FOR MORE VISIT: http://caasmeet.wordpress.com/2014/06/03/income-tax-return-filing-due-dates-fy-13-14-ay-14-15/

Saturday, August 09, 2014

మెదడుకు వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే...

            వృద్ధాప్యం ఎలాగూ వస్తుంది. ఎవరూ ఆపలేరు. అయితే, వృద్ధాప్యం వస్తున్న కొద్దీ మెదడు పదును, గ్రహణశక్తి తగ్గుతూ ఉంటుంది చూడండి, దానికి ఒక విరుగుడు ఉందంటున్నారు. అది, రెండు, అంతకంటె ఎక్కువ భాషలు వచ్చి ఉండడం. ఎక్కువ భాషలు వచ్చి ఉండడానికి, మెదడు పదునుగా ఉండడానికి సంబంద óమేమిటని మనకు వెంటనే అనిపిస్తుంది. కానీ కచ్చి తంగా సంబంధముందని ఎడింబరో విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు చెబుతున్నారు. దీనిని నిరూపించడానికి 1947లోనే ఒక ప్రయోగం చేప ట్టారు. ఆశ్చర్యమేమిటంటే ఆ ప్రయోగ ఫలితాన్ని యాభై ఏళ్ల తర్వాత పరిశీలించి వృద్ధాప్యంలో కూడా మెదడు చురుకుగా ఉండడానికి, రెండు మూడు భాషలు తెలిసి ఉండడానికి సంబంధముందని నిర్ధారించారు. ఈ ప్రయోగానికి స్కాంట్లాండ్‌లోని ఎడింబరోకు చుట్టు పక్కల ఉన్న 835 మందిని ఎంచుకున్నారు. వీరంతా ఇంగ్లీష్‌ మాట్లాడతారు. 1947లో వీరికి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వీరి మేధోశక్తిని పరిశీలించారు. 2008-20010 మధ్యలో వీరు 70వ పడిలో ఉన్నప్పు డు మరోసారి పరీక్షించారు. వీరిలో 195 మంది తమకు 18 ఏళ్ల లోపు వయసు ఉన్నప్పుడు కానీ, 65 ఏళ్లు దాటి న తర్వాత కానీ రెండు లేదా అంతకంటె ఎక్కువ భాషలు నేర్చుకున్నారు. ఒక్క భాష మాత్రమే తెలిసిన వారితో పోల్చితే, వీరి మెదడు వృద్ధాప్యంలో కూడా చురుకుగా ఉన్నట్టు తేలింది. సాధారణమైప ఇంటెలి జెన్స్‌లోనూ, పుస్తకపఠనంలోనూ ఈ తేడా మరింత ఎక్కువగా కనిపిం చింది. ఈ అధ్యయనంలో ఇంకొకటి కూడా వెల్లడైంది. ఒకటి కంటె ఎక్కువ భాషలు చిన్న ప్పుడు నేర్చేకున్నా, పెద్దయిన తర్వాత నేర్చుకున్నా మెదడు చురుకుదనం మీద, గ్రహణశక్తి మీద ఒకే రకమైన సానుకూల ప్రభావా న్ని చూపిస్తుంది. అంతే కాదు. కొత్త భాషలు నేర్చుకోవడం వల్ల మెదడు చురుకు దనం పెరుగుతుందా లేక సహజం గానే మెదడు చురు కుగా ఉండేవారు ఎక్కువ భాషలు నేర్చుకుంటారా అన్న చర్చ కూడా మొదట్లో జరిగింది. అయితే, ఒకటిని మించిన భాషలు నేర్చుకున్న తర్వాతే మెదడు పదును పెరుగుతుందని ఈ అధ్యయనం తేల్చింది. మన పురా ణాల్లో ఆదిశేషుడికీ, హనుమం తుడికీ అనేక భాషలు వచ్చని చెబుతుంటారు. వారు మంచి పండితులుగా, మేధావులుగా గుర్తింపు పొంద డంలోని రహస్యం ఇదే కావచ్చేమో. మన సమకా లికు ల్లోనూ, ఇంతకుముందూ కూడా బహుభాషావేత్తలు చాలామందే ఉన్నారు. వీరు కూడా మేధావులుగానే గుర్తింపు పొందారు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా కొత్త భాషలు నేర్చుకోవడం ప్రారంభించండి

ఐటీ ఈమెయిల్ ఐడీని భద్రంగా ఉంచుకోండి..

ఐటీ రిటర్నుల ఆన్‌లైన్ ఫైలింగ్ కోసం ట్యాక్స్‌పేయర్ల ఈమెయిల్ ఐడీలు, మొబైల్ ఫోన్ నంబర్లను ఇప్పటికే కోరిన ఐటీ విభాగం తాజాగా తమ ఈమెయిల్ ఐడీని సేఫ్ లిస్ట్‌లో భద్రపర్చుకోవాలని సూచించింది. పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌బాక్స్‌లోని వైట్/సేఫ్ లిస్ట్‌లో donotreply @incometax indiaefiling.gov.in అనే ఐడీని ఉంచాలనీ, తద్వారా స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా చూసుకోవాలనీ కోరింది. దీనివల్ల తాము పంపే మెయిళ్లు స్పామ్, జంక్ ఫోల్డర్లోకి వెళ్లకుండా ఉంటాయని తెలిపింది.

Address for Communication

Address card