Wednesday, February 08, 2017

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెరగడానికి ఏ విధంగా కారణం అవుతాయో తెలుసా?





                 మీకు అవగాహన ఉందో లేదో తెలియదు కాని ప్రభుత్వాలు ప్రజల  నుండి వివిధ రూపాలలో  ఇరవై  రకాల పన్నులను వసూలు చేస్తున్నాయి . వాటిలో అత్యంత ప్రముఖమైనవి ఇనకం టాక్స్ , వ్యాట్ ట్యాక్స్  సర్వీస్ టాస్క్,ఎక్సయిజ్ మొదలగినవి  .
                ప్రజల వద్ద  నుండి ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం తో దేశాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు ,రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు మొదలగునవి  సమకూర్చుకోవడానికి వినియోగిస్తారు.

                ఈ రోజు  ప్రజలూ సంపాదిస్తున్న మొత్తంలో అధిక శాతం టాక్స్ లు చెల్లించడానికే  పోతుంది(దగ్గర దగ్గరగా 48 % అని బిజినెస్ స్టాండర్డ్ ఆంగ్ల పత్రిక అంచనా). సాదారణంగా ప్రజలూ వారూ చెల్లించే పన్నుల ద్వారా దేశాభివృద్ది జరుగుతుంది అని ఆశిస్తారు. కాని ఈ పన్నులు ఒక ప్రజల యొక్క ఆర్ధిక పరిస్థతి ని చాలా దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి.   ముందుగా మీరు ఇన్ఫ్లేషన్ గురుంచి అర్ధం చేసుకోండి. ఈ ఇన్ఫ్లేషన్ మరియు టాక్స్ లు ప్రజల ఆర్ధికస్థితి
పై ఏ విధమైన ప్రభావం చూపిస్తున్నాయో తెలుసుకుందాం.
                మీకు ఇన్ఫ్లేషన్ గురుంచి వివరంగా తెలుసుకోవాలి  అంటే వికీపీడియా లో వుంది చదవండి.
                రోజు రోజుకి వస్తువులా ధరలు పెరుగుతున్నాయి   అనే విషయం మీ అందరికి తెలుసు. చాలా మంది ప్రభుత్వం ఈ ధరల పెరుగుదలని అరికట్టడానికి ఇన్ఫ్లేషన్  పెరుగుదలని అరికట్టడానికి తగు చర్యలు తీసుకోవాలి అని బావిస్తుంటారు.వాస్తవానికి ప్రభుత్వం ఏమైన  చర్యలు తీసుకుంటుందా?. మీరు ఒక్కసారి వికీపీడియా లో గత పట్టికను గమనిస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా  ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది.సాదారణ మధ్యతరగతి కుటుంబం ఒక్కప్పుడు ప్రతి నెల రూ 10,000 లతో ఇంటి ఖర్చులు సరిపెట్టుకుంటే ఇప్పుడు అదే కుటుంబానికి రూ .  30,000  లు కూడా సరిపోవడం లేదు. దీనికి ప్రభుత్వం చెప్పే సమాధానం లైఫ్ స్టైల్ లో మార్పు . కాని వాస్తవం వేరే  ఉంది. అదేమిటో ఒక్కసారి చూద్దాం.
            VAT( value added tax )అనేది రాష్ట్ర ప్రభుత్వం విధించే టాక్స్ .దాని పేరు లోనే ఉన్నట్టుగా  వస్తువుకి  అదనపు విలువ కలవడం వలన వస్తువు ధర పెరిగి వస్తువు ధర మరింత అధికం  కావడానికి కారణం అవుతుంది.ఈ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళుతుంది.
            ఈ టాక్స్ రేటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. మీరు వస్తువులపై  ఎంత వ్యయం చేస్తే అంత అధికంగా పన్ను చెల్లించవలసి ఉంటుంది.సాదారణంగా పెట్రోలు , డిజీల్  మరియు గ్యాస్ ప్రతిఒక్కరికి అవసరమైనవి. ప్రస్తుతం ఇవి లేకుండా జీవితాన్నిఉహించలేం . వస్తువులు రవాణా చేయడానికి ఇందనం తప్పనిసరి . ఈ ఇందనం ధర పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి వస్తువులా ధరలు పెరగడానికి కారణం అవుతాయి.అంటే ఇందన ధరలు పెరిగితే , వస్తువుల ధరలు పెరగడంతో , ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది.ఉదాహరణకు ఒక వస్తువు ధర రూ 20 ఆయితే  ఇంధన ధరలు పెరగడం వలన రవాణా చార్జీలు పెరిగి ఆ వస్తువు ధర రూ25అవుతుంది. మీకు తెలుసా ? ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం దేశంలోకెల్లా అత్యధికంగా  39.66 % టాక్స్  వసూలు  చేస్తుంది. ఉదాహరణకు లీటరు పెట్రోలు రూ 75ఉంటే మీరు  చెల్లించే  డబ్బులలో రూ .21.30  ప్రభుత్వానికే వెళ్తాయి. అదే గోవాలో ఐతే కేవలం 0.1% మాత్రమే  పెట్రోలు పై వ్యాట్ విధిస్తున్నారు.దీనివలన రూ 20 తక్కువకే పెట్రోలు అక్కడ దొరుకుతుంది.గోవా ప్రభుత్వం ఈ విధంగా ప్రజలకోసం తక్కువ వ్యాట్ వసూలు చేస్తున్నప్పుడు మిగితా రాష్ట్రాలు ఆ విధంగా ఎందుకు చేయలేకపోతున్నాయి.వివిధ రాష్ట్రాలలో వ్యాట్ ఏవిధంగా ఉందో ఒక్కసారి పరిశీలించండి .వ్యత్యాసాలు మీకే అర్ధమవుతాయి.మనం పెట్రోలు పై మాత్రమే కాకుండా మనం కనుగోలు చేస్తున్న ప్రతి వస్తువుపై 5 % to 15%వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ వసూలు చేస్తుంది. దీని వలన వస్తువు యొక్క ధర పెరగడమే కాకుండా ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. అదే ప్రభుత్వాలు వ్యాట్ తగ్గిస్తే ధరలు తగ్గి , ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. కాని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిధంగా మాత్రం చేయవు. వాటికి ఇన్ఫ్లేషన్ పెరిగి ప్రజలూ ఇబ్బందులపాలు ఐనా పర్వాలేదు. కాని వాటి ఆదాయాన్ని పోగొట్టుకోవడానికి మాత్రం ఇష్టపడవు.ఇది మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వం 14.00 %  సర్వీసు  టాక్స్ కూడా వడ్డిస్తూనే ఉంది..చాలా మంది ఇంతకు ముందు గోవాకి అక్కడి సుందర దృశ్యాలు. బీచ్ లు చూసి వస్తూ , వస్తూ కాజు కొనుక్కొని వచ్చే వాళ్ళు . ఇప్పుడు మాత్రం పెట్రోలు కూడా కొనుక్కొని వస్తున్నారు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card