Saturday, January 28, 2017

కొంతమందిది ‘మందు’ చూపు -మరి కొంతమందిది ‘ముందు’ చూపు



             నేను ఇంతకు ముందు media గురించిన చర్చలో power లో ఉన్నవాడు తనకు అనుకూలంగా వాడుకునే సాధనం అన్నాను. ఒక తరం నించి ఇంకో తరానికి చరిత్రని pass చేసే సాధనం కూడా media నే. ఈ మాధ్యమం ఉపయోగించుకుని పాలకవర్గం, గెలిచిన పక్షం ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు elevate చేసుకునే విధంగా ప్రచారం జరుగుతుంది. అసలు నిజం చరిత్రలో శిధిలమైపోతుంది. ఈ నిజం కూడా ఎవడికి అర్ధమైనంతవరకు వాడికి తెలిసిందే నిజం. 


      గత చరిత్రని ఏమార్చటం (history Duping)  గురించి చాలా సార్లు చెప్పాను. ఇంకోసారి మాట్లాడుకునే ముందు current affairs in Andhra గురించి ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా ఆస్తులు కూడబెట్టడాని arrest చేశారు. కానీ సాక్షి tv చూస్తే అతనంత ఉత్తముడు, ధీరోదాత్తుడు ఇంకోడు కనపడడు. అదే tv లో ysr- గాంధీ తరువాత గాంధీ అంతటి వాడు. విజయమ్మ గారిని అడిగితే ఆవిడ బిడ్డ అంత అమాయకుడు ఇంకెవరూ లేరని, జగన్ ని అకారణంగా arrest చేశారని ఆవిడ ఆవేదన. అలాగే etv ,ఆంధ్రజ్యోతి చూస్తే అతనంత దారుణమైన మనిషి కనపడడు.ఒకో చానల్ ఒక్కొక్కరిని లేదా నచ్చిన వారిని  ఆకాశానికి ఎత్తేస్తుంది.నచ్చని వాళ్ళని దూషిస్తుంది. ysr గురించి చంద్రబాబు ని , చంద్రబాబు గురించి కాంగ్రెస్ నేతలనీ, వీళ్ళిద్దరి గురించి bjp ని, వాళ్ళ గురించి communists ని అడిగితే , ఎవడి version వాడికి ఉంటుంది. నిజమేంటంటే అందరూ ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారు. విచిత్రంగా జనాలు అలవాటు పడిపోయారు. ఎదోఒక చానల్ని నమ్మేవాడు అదే నిజమనుకుంటాడు వాదిస్తాడు. పైనే చెప్పా ఎవడికి అర్ధమైనంతవరకు వాడికి తెలిసిందే నిజం అంటాడని . history Duping అంటే ఇదే.

             మా హైస్కూల్ సోషల్ మాస్టర్ గాంధీగారిని తిట్టేవారు. ఆయన ఉద్దేశ్యం ప్రకారం గాంధీ వల్లే పాకిస్తాన్ వేరు పడిందని, స్వతంత్రం రావడానికి గాంధీ సత్యాగ్రహం కారణం కాదని, English వాళ్ళు ప్రపంచయుధ్ధం లో వారి దేశాన్ని వాళ్ళే కాపాడుకోవటానికి కష్టపడాల్సి వచ్చిందని, అప్పుడు భారతదేశాన్ని పరిపాలించడానికి కష్టమై వదిలి వెళ్లిపోయారని, అప్పటి వరకు వారు తయారు చేసిన Indian regiments ని కూడా యుధ్ధం లో వాడుకోవాల్సి వచ్చిందని ఇలా రకరకాలుగా చెప్పేవారు. ఆయన చెప్పేవరకు 9th std వరకు నాకు గాంధీ జాతిపిత. ఆయన వలనే స్వతంత్రం వచ్చింది. గాంధీ మహాత్ముడు. ఆయన చెప్పింది విని చరిత్రని వేరే కోణం లోంచి చూడొచ్చు అని తెలుసుకున్నాను. ‘ఇంటర్’ ఆఖర్లో అనుకుంటా నేను చెలం ‘మ్యూజింగ్స్’ చదివే వరకు నాకు గాంధీ గురించి ఆయన చెప్పిన అభిప్రాయం లోనే ఉండేవాడిని. నేను confuse అయ్యాను. ఎందుకంటే చెలం ప్రకారం గాంధీ మహాత్ముడు. మా మాస్టర్ గారి ప్రకారం పనికి రాని వాడు. ఆ confusion లో డిగ్రీ అయిపోయిన చాలా రోజుల తర్వాత నేను గాంధీ గారు వ్రాసిన ఆత్మకధ "My experiments with truth" చదివాను. చెలం చెప్పింది నిజమనిపించింది. కానీ నేను చదివిన చరిత్ర పుస్తకాల inference తో నాకు అనిపించింది ఏంటంటే 1915 నించి 1947 వరకు జరిగిన independence struggle లో రకరకాల situations లో ఆయన handle చేసిన తీరు ఆయన గొప్ప individual, గొప్ప leader అని prove చేస్తాయి కానీ మంచి administrator కాదన్న విషయాన్ని చెప్పకనే చెబుతాయి.ఆ రోజుల్లో నాకున్న నా ఆవేశానికి సుభాష్ చంద్ర బొస్ correct అనిపించాడు. స్వతంత్రం అన్నది ఎవడో ఇస్తే తీసుకునేది కాదు, యుధ్ధం చేసైనా గెలిచి సంపాదించాలనే concept correct అనిపించింది. గాంధీ గారి మాటలతో బొస్ గారు కూడా ఆగడం, గాంధీగారు almost నెహ్రూగారు చెప్పింది చెయ్యడం, నెహ్రూగారి political handling sequences, ఆయన అనుయాయులు ఆయన విధానాల్ని దెబ్బతీసిన తీరు,ఖిలాఫత్ అని ముస్లిములు ఆయనకి దూరమైన తీరునవఖలీ లో హిందూల మీద జరిగిన అత్యాచారానికి ఆయన స్పందించిన తీరు, partition time లో ముస్లిం లీగ్ జిన్నా, Poona pact time లో అంబేద్కర్ అతని team blackmail చేసి commitments తీసుకున్న తీరు, power కోసం నెహ్రూగారు చేసిన విన్యాసాలు,  ఇలాటివన్నీ చదివిన తరువాత అప్పుడు తిరిగి మళ్ళీ కొంత మా మాస్టర్ గారి మాటలకి justification దొరికినట్టు అనిపించింది. తర్వాత కారా  మాస్టరు గారు వ్రాసిన కుట్ర కథ చదివి history కి ఇంకో angle తెలుసుకున్నాను. ఇందులో history duping ఎంటయ్యా నువ్వు కూడా ఎక్కడో చదివి తెలుసుకున్నదే కదా అంటే, వెతుక్కుని ఎవడేవడో వ్రాసినవన్నీ చదివి కొంత ఊహించి, కొంత క్రోడీకరించి అర్ధం చేసుకుని ఓహో ఇదా అనుకోవడం తప్పిస్తే అసలేం జరిగిందో ఎవడికి తెలుసు. Result అర్ధం అవుతుంది కానీ ఏ situation నించి ఈ result వచ్చిందో ఎలా తెలుస్తుంది.
                 టోటల్ గా చెప్పేదేమిటంటే ఏ కాలం అయినా నాయకుల స్టేట్మెంట్లన్ని  వాస్తవాలుకాదు. చరిత్ర పేరుతొ చెప్పెలేక్కలన్ని నిజాలు కావు.ఎవరి వ్యక్తిగత కారణాలు వారికున్నాయి. ఏ ఉద్యమం అయినా ,ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే ఎందుకు మొదలు  అని ఆలోచించటం మొదలు పెడితే చాలు!.....  ఎగిరిన తేనెటీగ ల్లో ఒకటయిన కుట్టక పోతుందా.. ఏ కారణం లేకుండా ప్రజలు కూడా వారిని గుడ్డిగా అనుసరించే రోజులు పోయినయ్.   కొంతమందిది ‘మందు’ చూపు -మరి కొంతమందిది ‘ముందు’ చూపు-అవసరం మనీ తోనో -వలపు కామిని తోనో – ఎదో సినిమాలో ‘బాబూమోహన్’  చెప్పినట్లుగా  ‘ఎక్కడ,ఏమిటి,ఎందుకు,ఎలా......
.అని ప్రయత్నిచారంటే  చాలు  ...చరిత్ర కొత్తగా.. వర్తమానం విచిత్రంగా. మీకు మీరే శత్రువుగా. జ్ఞానిగా, ఓ నిరుత్సాహం.ఓ నిట్టూర్పు. ------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card