Saturday, September 29, 2018

ఏది సంప్రదాయం? ఏది స్వేచ్ఛ? ఏది జోక్యం?





ప్రపంచమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటోంది. మనం మాత్రం మహిళలను ఆలయంలోకి అనుమతించాలా, వద్దా? అనే అంశం దగ్గరే ఊగిసలాడుతున్నాం!
             ఆ మధ్య ఒక మహిళా జర్నలిస్ట్‌ రాసిన వ్యాసంలో ఒలకబోసుకున్న ఆవేదన ఇది. శబరిమలైలోని స్వామి అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించడం గురించిన వివాదం కేరళ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలోనే ఆమె ఆ వ్యాసం రాశారు. మనం’…. అంటే…. మొత్తం భారతదేశంలో మహిళల గురించి…. మాత్రం ‘…కాదు. కేవలం హిందూ మహిళల గురించి మాత్రమే ఆమె బాధ

ఇంతకీ అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునా లేదా అంశం మీద నిర్ణయించే అధికారం కోర్టుల పరమైంది. తాజాగా సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. అంతకు ముందు కేరళ హైకోర్టులో జరిగాయి.      

                                     క్రైస్తవ సంప్రదాయంలో కూడా కొన్ని మతాచారాలలో స్త్రీలకు పరిమితులు ఉన్నాయి. కానీ వాటి గురించి చర్చించే అధికారం ఎవరికీ లేదంటున్నాయి ఆ వర్గాలు. చర్చిలలో అపరాధాలు ఒప్పుకునే కార్యమ్రాన్ని రద్దు చేయాలంటూ జాతీయ మహిళా కమిషన్‌ చేసిన సిఫారసులను అదే కేరళ చర్చి పెద్దలు, జాతీయ మైనారిటీ కమిషన్‌ తూర్పార పట్టాయి. మహిళా కమిషన్‌ చేసిన సిఫారసులు క్రైస్తవుల మనో భావాలను కించపరిచేవేనని ఎలాంటి శషభిషలు లేకుండా ప్రకటించాయి. క్రైస్తవుల మత విషయాలలో ఇతరుల జోక్యం సహించేది లేదని మైనారిటి కమిషన్‌ అధ్యక్షుడు ఘాయోరుల్‌ హసన్‌ రిజ్వి జూలై 29న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మను హెచ్చరించడం కూడా జరిగిపోయింది.
                            ముస్లిం మహిళలకు వారి ప్రార్థనా స్థలాలలోకి అనుమతి ఉండదు.
                             ఈ రెండు అంశాల గురించి మాత్రం ఇతరులుఎవరూ మాట్లాడకూడదు. కానీ చిరకాలం నుంచి వస్తున్న ఒక హిందూ ఆచారం గురించి కోర్టులు తమ అభిప్రాయాలను యథేచ్ఛగా వెల్లడించవచ్చునా? కోర్టుల కంటే ముందే మీడియా తీర్పులు ప్రకటించ వచ్చునా? కాబట్టి ఆ మహిళా జర్నలిస్ట్‌ మహిళలకే సంబంధించిన ఈ రెండు అంశాల మీద కూడా    ఎందుకు స్పందించలేదు ? స్పందించాలని కోరుకుందాం. అయితే అది దురాశే అవుతుంది. అది వేరే విషయం. మరొక వాస్తవాన్ని కూడా గుర్తించాలి. భారతదేశంలో దాదాపు 99 శాతం ఆలయాలలో మహిళల ప్రవేశం మీద ఎలాంటి ఆంక్షలూ లేవు. కొన్నిచోట్ల మూలవిరాట్టును తాకుతూ అర్చనలు చేసే హక్కు కూడా ఉంది
                హిందూ ధర్మంలో ఏదైనా ఆరాధనకీ, విశ్వాసానికీ దేవుని ప్రతిమ, ఆలయం, గర్భగుడి వంటివి కీలకంగా ఉంటాయి. ఇది మితవాద, వామపక్ష, స్త్రీవాదానికి సంబంధించిన అంశం కాదు. ఇది మనోభావాలకి సంబంధించింది.
 అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు సైతం ప్రవేశం కల్పించాలని కోరుతున్నవారు హిందూ ధర్మం పట్ల కనీస మర్యాద ఉంటే దేవుడు ఆ ధర్మం చెబుతున్న వాస్తవాన్ని కూడా గమనంలో ఉంచుకోవాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681


No comments:

Post a Comment

Address for Communication

Address card