Saturday, November 16, 2019

దేవుడికి తెలుగు రాదు


“తెలుగు” ను ఎందుకు “పరిపాలన భాష” గా అమలు చేయలేరు!?.


  
              ప్రభుత్వం లో అధికారభాష ఆంగ్లం . ఫైల్స్ అన్నీ ఆంగ్లం లోనే నడుస్తాయి.న్యాయ స్థానాలు లో మరీదారుణం ..కక్షిదారులు కి తెలుగు తప్ప ఏ భాషా రాదు.అయినా సరే వాదాలు అన్నీ ఆంగ్లం లో రాస్తారు.ఎందుకో అలా... బ్యాంక్ లావాదేవీలు గూడా తెలుగులోనే జరగాలి.  ఆదాయ,నివాస,జనన, మొదలైన ద్రువీకరణ లే కాదు  రకారకాల  ప్రభుత్వ  విభాగాల ఉత్తర ప్రత్యుత్తరాలనన్నీ ఆంగ్లం  లొనే వుంటున్నాయి. సామాన్య జనానికి వ్యవహారాలలో ఏమి జరుగుతోందో తెలియటంలేదు. వారి నిబ్బరాలు దెబ్బతింటున్నాయి
               ప్రభుత్వం తెలుగును స్కూల్స్ లో ఒక సబ్జెక్టుగా పెట్టిప్రోత్సహిస్తామని చెబుతున్నది కానీ ఆఫీసులలో మటుకు ఆంగ్లం ఫైల్స్ చక్కర్లు కొడుతున్నాయి.
               తెలుగుభాషను క్షీణ దశ నుంచి బయటకు తీసురావాలంటే ..శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి అని తెలుగులో చెప్పుకుంటే  సరిపోదు. ప్రజలు కూడా ప్రభుత్వం తో ఉత్తర  ప్రత్యుత్తరాలను ,ఫిర్యాదులను తెలుగులోనే చెయ్యాలి, ప్రభుత్వమూ తెలుగు లోనే జవాబివ్వాలని ఒత్తిడిచెయ్యాలి. ప్రభుత్వం పూనుకుంటేనే సామాన్యులు అనుసరిస్తారు.
               వెంకయ్యగారన్నట్లు రెండురాష్ట్రాల్లో ఉద్యోగాలకు తెలుగు వచ్చిఉండటం ఒక అర్హత కావాలి,’ కోర్టుల్లో కూడా వాదోపవాదాలు,తీర్పులు తెలుగులోనే అమలయ్యేలా చూడాలి. ప్రభుత్వం లోని మంత్రులంతా వాళ్ళకు పంపబడే ఫైళ్ళు అన్నీ ఖచ్చితంగా తెలుగులోనేఉండాలనే నిబంధన పాటించాలి!. అదే విధంగానే సెక్రటేరియట్ మాన్యువల్, బిజినెస్ రూల్స్లో గూడా ఆ నిబంధనను చేర్చాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి గారు గుర్తించాలి, చక్కగా తెలుగులో రాయడం వలన ఆంగ్లం రానివారు తేలికగా. అర్థం చేసుకునే వీలుంది.
                      ఇప్పుడు ప్రభుత్వ ప్రయివేటు కార్యక్రమాలకు ఆధునిక ,సాంకేతిక పరికరాల వాడుక తప్పనిసరి. వాటిలో ఇప్పుడు తెలుగు వాడకం అనుకూలం కనుక, తెలుగును ప్రభుత్వం కాని, న్యాయవిభాగం కాని, ప్రజలు కాని వ్యవహారికి భాషగా వాడటానికి ఏ ఇబ్బంది లేదు.తగిన వనరులు. పరికరాలు, పారిభాషికా పదాలు... గట్రా... లేవన్నకుంటి సాకులు చూపకుండా, ప్రస్తుత సోషల్ మీడియాలో ఎంత చక్కని తెలుగు లోసామాన్యులూ కూడా తమ భావాలు వ్యక్తపరుస్తున్నది చూస్తూనే ఉన్నాము          
                మన ఉద్యోగులు, తెలుగు వాళ్ళుగా పుట్టి   “ప్రజల భాష అయిన తెలుగు”  ను ఎందుకు పరిపాలన భాషగా అమలు చేయలేరు!?.     
             తెలుగు లో పాలనా, విద్య అన్నీ జరిగితేనే జాతి మొత్తంఅభివృద్ధి సాధిస్తుంది . యూరోపు , చైనా, జపాన్ , కొరియాల మాతృభాషలో భోధనలు పాలనల వల్ల ప్రజలలో పెక్కుమందికి పాలుపంచుకుని పురోగతికి తోడ్పడే అవకాశంలభించడం వల్ల ఆ సమాజాలు దూసుకెళ్ళాయి అనేది మన పాలకులు, విద్యావేత్తలు , అధికారులు గ్రహించాలి
            మొదట మన భాషా మన రాష్ట్రం అనేది ప్రతి వారి నరనరానా రుధిరాన విప్లవ ఘోషలా ప్రసరించాలి, తెలుగుభాషకి  గౌరవం  ఇచ్చి, తన స్థాయిని పెంచాలి అని మనస్పూర్తిగా కృషి చేసేవారిలో నా దృష్టిలో ప్రధమ స్థానం నూర్ భాషా రహంతుల్లా గారిదే, నాకు తెలిసినంత వరకూ రహంతుల్లా గారు తెలుగు కోసం తపించేంతగాఎవ్వరూ అంతగా కృషి చేయడం నేను చూడలేదు.
                    పక్క రాష్ట్రం తమిళనాడులో వాళ్ళమాతృభాషకి ఇచ్చుకున్న ప్రాధాన్యం మనం మన భాషకి ఇవ్వడం లేదు, వాళ్ళ రాష్ట్రంవెళ్తే ఒక్క బోర్డ్ కూడా పరాయి భాషలో కనపడదు, అన్నీ తమిళంలోనే వుంటాయి, ఒకవేళ ఆంగ్లం లో రాసినా కూడా మొదటగా వాళ్ళ మాతృభాషలో రాసి ఆ తర్వాత ఆంగ్లము వాడరు, అది వాళ్ళు వాళ్ళ భాషకి ఇచ్చే గౌరవ స్థానం, మర్యాద!!
                రహంతుల్లా గారి మాటల్లోఅమ్మఒడి, బడి, ఏలుబడి'......ఈ మూడింటిలోతెలుగును సంపూర్ణంగా అమలుచేసినపుడే మాతృభాష మనగలుగుతుంది.....లేదంటే మృతభాషగా మారిపోతుంది”
                పేదలు - ఆంగ్లం చదువులు విషయానికి వస్తే .. ఎంతమంది పేదల పిల్లలు ఆ ఉచిత బళ్ళలో చేరి, చదువు పూర్తిగా కొనసాగిస్తున్నారు   . ఆంగ్లలో భొదిస్తే చాలా మంది ప్రైవేటు బళ్ళలో చేరటం మానేస్తారా? తెలీదు.
            ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యలేక చాలా మంది ప్రైవేటు వాటికి వలస పోతున్నారన్న నేపధ్యంలో, ఈ నిర్ణయం జరిగినా, సెంట్రల్ సిలబస్ చేర్చటం వెనుక ఉన్నది ఆర్థిక కారణమే అని గ్రహించాలి. ఈ CBSC సిలబస్ పెడితే కేంద్రప్రభుత్వం 12వ తరగతి వరకూ కొన్ని రాయితీలూ,ఫండ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అవి ప్రస్తుతం ఉన్న రాష్ట్రపరిస్థితుల్లో చాలా అవసరం.


Friday, November 15, 2019

120% ITC ద్వారా రాబోయే సమస్యలు


ఒక నెల GSTR 3B నుండి GSTR 2A లో చూపిన దానిపై  120% ITC మీరు గరిష్టంగా తీసుకోండి అని . రూల్ 36 (4) CGST  చెప్తుంది
కానీ వాటి ద్వారా  రాబోయే  సమస్యలు -
1. GSTR 1 ని ‘11 ‘తేదీ అర్ధరాత్రి 11.59 PM కు ఖచ్చితంగా  లాక్ చేస్తాం అని చెప్తుంది. వాస్తవానికి 11 వ తేదీకి ముందు ఎంత మంది పన్ను చెల్లింపుదారులు GSTR 1 ని దాఖలు చేస్తారు? మరియు పోర్టల్ ప్రతి నెల 10’ , “11” లో రద్దీ కారణంగా లేదా సాంకేతికంగా  పని చెయక పొతే? మన నెలవారీ సరఫరాదారు 12 లేదా 13 న ఫైల్ చేస్తే? వచ్చే నెలలో మాత్రమే మనకు ఈ క్రెడిట్ వస్తుందా ?? అతను  సకాలము లో  దాఖలు చేయక పోవడం మన తప్పా ??  మనం ఐటిసి పొందిన తరువాత జిఎస్టిఆర్ 2 ఎ అప్‌డేట్ / సవరించబడినప్పుడు అంటే జిఎస్‌టిఆర్ 1 గడువు తేదీ తర్వాత ఏమి జరుగుతుంది?
2. 120%  నిర్ధారణ GSTR 2A యొక్క స్థితిని  11 ”తేదీ ప్రకారం అర్ధరాత్రి 11.59 PM కు ఖచ్చితంగా  లాక్ చేయడం పై అధార్ పడి వుంటుంది. . లాక్ చేయబడకుండా  11 న ఎలా పొందగలం? ఏ సాఫ్ట్‌వేర్‌ కూడా  అందించలేదు. GSTR2A ఒక డైనమిక్ ఫారం ఇది చాలా ఉపయోగం ,  ఎస్సెస్మెంట్ / విచారణ / పరిశోధనల సమయంలో  చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి.
3. మన 120%% ని నిర్ణయించడానికి, ఈ గజిబిజి దశలను అంచనా వేయడానికి  మనకి ఎంత సమయం, ఎంత సహనం, ఎంత నైపుణ్యం ఉంటుంది ?? మనపై  భారం సమయం మరియు ఖర్చు చాలా రెట్లు పెరుగుతుంది. ప్రభుత్వం వారు దీన్ని నిజంగా సింపుల్‌గా చేస్తున్నారా?మీకు అలా అనిపిస్తుందా?
4. రిజిస్టర్డ్ వ్యక్తి ప్రతి నెలా క్రెడిట్ మ్యాచింగ్ చేయవలసి ఉంటుంది మరియు క్లెయిమ్ చేయని క్రెడిట్ల కోసం తరువాతి నెలల్లో కూడా వెతకాల్సిన అవసరం వుంది. అర్హతగల ఐటిసి గుర్తింటం ఒక పని, క్లెయిమ్ చేయని ఐటిసిని ట్రాక్ చేయడం మరియు తరువాతి నెలల్లో రిపోర్టింగ్ను ట్రాక్ చేయడం  మొత్తం గజిబిజి పని. ఇంకా సమయం ఉంతుందా?
5.నిర్వహణా మూలధనం(నగదు) ప్రతిష్టంభన కూడ ఉంటుంది. SME రంగం దీనికి సిద్ధంగా ఉందా ??
6. వారు త్రైమాసిక సమస్యను పూర్తిగా మరచిపోయారు. త్రైమాసిక రాబడిని దాఖలు చేసే SME సరఫరాదారులకు సడలింపు లేదు. గ్రహీతకు త్రైమాసిక ప్రాతిపదికన క్రెడిట్ లభిస్తుంది. మొత్తం రిజిస్టర్డ్ టాక్స్ చెల్లింపుదారులలో త్రైమాసికంలో దాఖలు చేసే వారు 7% మాత్రమే అని కారణం చెప్పడం తార్కికంగా ఉందా ??ఒక వేళ త్రైమాసికంలో దాఖలు చేసే మెజారిటీ సరఫరాదారులు నా వద్ద ఉంటే? వారు చెప్పేది ఏమిటంటే మీరు ఈ ఐటిసిని త్రైమాసిక ముగింపు నెలలో తీసుకోండి .అని.. ఇది న్యాయమా ??
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్

20% నిబంధన ఓ ప్రశ్నార్థకం –ఒక ప్రహేళిక !


20% నిబంధన ఓ ప్రశ్నార్థకం –ఒక ప్రహేళిక  !
(2 వ భాగం)
సరఫరాదారులు  కొన్ని ఇన్వాయిస్లు తరువాతి నెల రిటర్న్లో అప్లోడ్ చేస్తే ఏమిటి?.
20% నిబంధన నెలవారీ లేదా త్రైమాసిక లేదా ఏటా వర్తించాలా అనేది స్పష్టంగా లేదు. అందువల్ల, వడ్డీ కూడా ప్రశ్నార్థకం.
ఉదాహరణ:
ఈ నెలలో నాకు రావలసిన ఇన్పుట్-రూ.1,00,000/-, కానీ నేను రిటన్ దాఖలుచేసే సమయానికి 2ఎ ప్రకారం—రూ.60,000/-వుంది.అంటె రూ.72,000/-మాత్రమే నాకు ఈ నెల అందుబాటులో వుంది.సరె అలాగే రిటన్ సబ్మిట్ చెసాం.
  తర్వాత  కొంత మంది అప్లొడు చెయటం వల్ల రూ.20,000/- అదనంగా ఆ నెలలొనే చెరింది .ఇప్పుడు
20% లెక్క తప్పింది. ఎలా ?
            ఇదే నెల కి సంబందించిన సరఫరాదారులు  వెర్వెరు నెలల్లొ  అప్లొడు చెస్తె ఎలా. దీనికి  గడువు ఏమయినా వుందా? తర్వాత  ఎప్పుడొ అందరూ అప్లొడు చెస్తే  అదనపు  20%  రిఫండు ఏలా? దీన్ని ఎలా సరిచెయాలి. తర్వాత నెలల్లొ ఎలా సర్దుబాటు చెయాలి. అసలు ఖాతా పుస్తకాల్లో ఈ అన్ని ఎంట్రీ లు  ఎలా రాయాలి
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్,పొన్నూరు

Address for Communication

Address card