Saturday, November 16, 2019

“తెలుగు” ను ఎందుకు “పరిపాలన భాష” గా అమలు చేయలేరు!?.


  
              ప్రభుత్వం లో అధికారభాష ఆంగ్లం . ఫైల్స్ అన్నీ ఆంగ్లం లోనే నడుస్తాయి.న్యాయ స్థానాలు లో మరీదారుణం ..కక్షిదారులు కి తెలుగు తప్ప ఏ భాషా రాదు.అయినా సరే వాదాలు అన్నీ ఆంగ్లం లో రాస్తారు.ఎందుకో అలా... బ్యాంక్ లావాదేవీలు గూడా తెలుగులోనే జరగాలి.  ఆదాయ,నివాస,జనన, మొదలైన ద్రువీకరణ లే కాదు  రకారకాల  ప్రభుత్వ  విభాగాల ఉత్తర ప్రత్యుత్తరాలనన్నీ ఆంగ్లం  లొనే వుంటున్నాయి. సామాన్య జనానికి వ్యవహారాలలో ఏమి జరుగుతోందో తెలియటంలేదు. వారి నిబ్బరాలు దెబ్బతింటున్నాయి
               ప్రభుత్వం తెలుగును స్కూల్స్ లో ఒక సబ్జెక్టుగా పెట్టిప్రోత్సహిస్తామని చెబుతున్నది కానీ ఆఫీసులలో మటుకు ఆంగ్లం ఫైల్స్ చక్కర్లు కొడుతున్నాయి.
               తెలుగుభాషను క్షీణ దశ నుంచి బయటకు తీసురావాలంటే ..శుభోదయం, శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి అని తెలుగులో చెప్పుకుంటే  సరిపోదు. ప్రజలు కూడా ప్రభుత్వం తో ఉత్తర  ప్రత్యుత్తరాలను ,ఫిర్యాదులను తెలుగులోనే చెయ్యాలి, ప్రభుత్వమూ తెలుగు లోనే జవాబివ్వాలని ఒత్తిడిచెయ్యాలి. ప్రభుత్వం పూనుకుంటేనే సామాన్యులు అనుసరిస్తారు.
               వెంకయ్యగారన్నట్లు రెండురాష్ట్రాల్లో ఉద్యోగాలకు తెలుగు వచ్చిఉండటం ఒక అర్హత కావాలి,’ కోర్టుల్లో కూడా వాదోపవాదాలు,తీర్పులు తెలుగులోనే అమలయ్యేలా చూడాలి. ప్రభుత్వం లోని మంత్రులంతా వాళ్ళకు పంపబడే ఫైళ్ళు అన్నీ ఖచ్చితంగా తెలుగులోనేఉండాలనే నిబంధన పాటించాలి!. అదే విధంగానే సెక్రటేరియట్ మాన్యువల్, బిజినెస్ రూల్స్లో గూడా ఆ నిబంధనను చేర్చాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి గారు గుర్తించాలి, చక్కగా తెలుగులో రాయడం వలన ఆంగ్లం రానివారు తేలికగా. అర్థం చేసుకునే వీలుంది.
                      ఇప్పుడు ప్రభుత్వ ప్రయివేటు కార్యక్రమాలకు ఆధునిక ,సాంకేతిక పరికరాల వాడుక తప్పనిసరి. వాటిలో ఇప్పుడు తెలుగు వాడకం అనుకూలం కనుక, తెలుగును ప్రభుత్వం కాని, న్యాయవిభాగం కాని, ప్రజలు కాని వ్యవహారికి భాషగా వాడటానికి ఏ ఇబ్బంది లేదు.తగిన వనరులు. పరికరాలు, పారిభాషికా పదాలు... గట్రా... లేవన్నకుంటి సాకులు చూపకుండా, ప్రస్తుత సోషల్ మీడియాలో ఎంత చక్కని తెలుగు లోసామాన్యులూ కూడా తమ భావాలు వ్యక్తపరుస్తున్నది చూస్తూనే ఉన్నాము          
                మన ఉద్యోగులు, తెలుగు వాళ్ళుగా పుట్టి   “ప్రజల భాష అయిన తెలుగు”  ను ఎందుకు పరిపాలన భాషగా అమలు చేయలేరు!?.     
             తెలుగు లో పాలనా, విద్య అన్నీ జరిగితేనే జాతి మొత్తంఅభివృద్ధి సాధిస్తుంది . యూరోపు , చైనా, జపాన్ , కొరియాల మాతృభాషలో భోధనలు పాలనల వల్ల ప్రజలలో పెక్కుమందికి పాలుపంచుకుని పురోగతికి తోడ్పడే అవకాశంలభించడం వల్ల ఆ సమాజాలు దూసుకెళ్ళాయి అనేది మన పాలకులు, విద్యావేత్తలు , అధికారులు గ్రహించాలి
            మొదట మన భాషా మన రాష్ట్రం అనేది ప్రతి వారి నరనరానా రుధిరాన విప్లవ ఘోషలా ప్రసరించాలి, తెలుగుభాషకి  గౌరవం  ఇచ్చి, తన స్థాయిని పెంచాలి అని మనస్పూర్తిగా కృషి చేసేవారిలో నా దృష్టిలో ప్రధమ స్థానం నూర్ భాషా రహంతుల్లా గారిదే, నాకు తెలిసినంత వరకూ రహంతుల్లా గారు తెలుగు కోసం తపించేంతగాఎవ్వరూ అంతగా కృషి చేయడం నేను చూడలేదు.
                    పక్క రాష్ట్రం తమిళనాడులో వాళ్ళమాతృభాషకి ఇచ్చుకున్న ప్రాధాన్యం మనం మన భాషకి ఇవ్వడం లేదు, వాళ్ళ రాష్ట్రంవెళ్తే ఒక్క బోర్డ్ కూడా పరాయి భాషలో కనపడదు, అన్నీ తమిళంలోనే వుంటాయి, ఒకవేళ ఆంగ్లం లో రాసినా కూడా మొదటగా వాళ్ళ మాతృభాషలో రాసి ఆ తర్వాత ఆంగ్లము వాడరు, అది వాళ్ళు వాళ్ళ భాషకి ఇచ్చే గౌరవ స్థానం, మర్యాద!!
                రహంతుల్లా గారి మాటల్లోఅమ్మఒడి, బడి, ఏలుబడి'......ఈ మూడింటిలోతెలుగును సంపూర్ణంగా అమలుచేసినపుడే మాతృభాష మనగలుగుతుంది.....లేదంటే మృతభాషగా మారిపోతుంది”
                పేదలు - ఆంగ్లం చదువులు విషయానికి వస్తే .. ఎంతమంది పేదల పిల్లలు ఆ ఉచిత బళ్ళలో చేరి, చదువు పూర్తిగా కొనసాగిస్తున్నారు   . ఆంగ్లలో భొదిస్తే చాలా మంది ప్రైవేటు బళ్ళలో చేరటం మానేస్తారా? తెలీదు.
            ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యలేక చాలా మంది ప్రైవేటు వాటికి వలస పోతున్నారన్న నేపధ్యంలో, ఈ నిర్ణయం జరిగినా, సెంట్రల్ సిలబస్ చేర్చటం వెనుక ఉన్నది ఆర్థిక కారణమే అని గ్రహించాలి. ఈ CBSC సిలబస్ పెడితే కేంద్రప్రభుత్వం 12వ తరగతి వరకూ కొన్ని రాయితీలూ,ఫండ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తుంది. అవి ప్రస్తుతం ఉన్న రాష్ట్రపరిస్థితుల్లో చాలా అవసరం.


No comments:

Post a Comment

Address for Communication

Address card