Wednesday, March 01, 2017

ఆశ్చర్యకరమైన, ఆవేదనాభరితమైన విషయం




ఉపాధి హామీలో పనిచేసిన కూలి ఆడుతూ పాడుతూ పనిచేసి గరిష్టంగా రూ.300 వరకు సంపాదిస్తున్నారు. మేస్త్రీ పని చేస్తే రోజుకు రూ.800 నుండి రూ.1200 సంపాదిస్తున్నారు. కానీ ఓ ఇంజనీర్ కు నెలకు రూ.6000 జీతం ఇచ్చే ఉద్యోగం దొరకడం లేదు. ఇంజనీరింగ్ చదివి రూ.3000 నుండి రూ.5000 కు ప్రైవేట్ పాఠశాలలలో పనిచేసే వారు వేల మంది కనిపిస్తారు. ఇక ఎంసీఏ, ఎంబీఎ చేసిన వారి పరిస్థితి అత్యంత దయనీయం. దీనికి కారణం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం .. ఈ దేశానికి చేయూత నిచ్చే యువత భవిష్యత్ ను కేవలం ఎన్నికల నినాదంగా, నిరుద్యోగులను రాజకీయ పార్టీలు క్యాష్ లెస్ కూలీలుగా భావించడమే ఈ పరిస్థితికి కారణం. ఇక ఈ యువతకు దిశానిర్దేశం చేసే నాయకుడు గానీ .. వీరి భవిష్యత్ గురించి ఆలోచించే ప్రభుత్వం గానీ ఇప్పటి వరకు లేకపోవడం. జూని యర్ కాలేజీలు లేని చోట్ల సైతం ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పి వేలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులను తయారు చేసిన ఫలితం. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు నిర్వహించిన సర్వే ప్రకారం చదువురానివారిలో కంటే చదువు కున్నవారిలోనే నిరుద్యోగం ఎక్కువ. చదువులేనివారు ఏ పని చేయడానికైనా సిద్ధం. చదువుకున్నవారు వీలైతే ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే ప్రైవేటు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు. లే దా నిరుద్యోగిగానే మిగిలిపోతారు. ఏదో ఒక పని చేసి కడుపు నింపుకోవాలని అనుకోరు. వ్యవసాయదారుల కుటుంబాలలోనూ చదువుకున్నవారికి కూడా పొలం పని చేయడం నామోషీ. తల్లిదండులు పని చేస్తుంటే నిరుద్యోగులు ఉద్యోగం కోసం నిరీక్షిస్తూ కూర్చుంటారు
                          నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొన్న ప్రభుత్వం ఒకసారి సర్వీస్ కమీషన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థికి అతని అర్హతలకు సరిపోయె ఉద్యోగ వివరాలు అతడి సెల్ కి తెలిసేలా ఏర్పాటు చేయాలి. ఇక కోచింగ్ సెంటర్ ల శిక్షణ కోసం వేలు ఖర్చు చేసి ఆర్థికంగా లేక ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ,ఉచితంగా క్లాసులో లేదా టీవీ ద్వారా నిపుణులతో పాఠాలు కూడ చెప్పిస్తే బావుంటుంది(ఆల్రెడీ ఇది తెలంగాణా లో ‘మన టీవీ’ ద్వారా జరుగుతుంది). అయితే ఆశ్చర్యకరమైన, ఆవేదనాభరితమైన విషయం ఏంటంటే రెండున్నరేళ్లలో ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలతో ప్రపంచం దృష్టిని, దేశం దృష్టిని ఆకర్షించిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి  మేధావులను గానీ, విపక్షాలను మాత్రం ఆకట్టుకోలేకపోవడం.
                       సరే మేధావులు కాబట్టి కొన్ని నిర్ణయాలు నచ్చలేదు అనుకుందాం .. ప్రభుత్వ ప్రాజెక్టులు, పథకాలు, విద్యా విధానంలో మార్పులకు చేస్తున్న కృషి, పారిశ్రామిక, ఐటీ విధానాలు, ఉపాధి కల్పన కోసం చేస్తున్న ఏ ప్రయత్నమూ నచ్చకపోవడం ఏం మేధావితనమో అర్థం కాదు. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపి .. మంచిని ప్రశంసించినప్పుడే మేధావులు అనేవారికి విలువ ఉంటుంది. కేంద్రం చేస్తున్న అన్యాయం గురించి ఏ మేధావి ప్రశ్నించడు. కేంద్రం నుండి రావాల్సిన వాటి గురించి నోరు తెరవడు. తెల్లారి లేస్తే ప్రభుత్వం మీద బురద చల్లడంలో మాత్రం ముందుంటాడు
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment

Address for Communication

Address card