పన్ను పరిధిలోకి వచ్చినవారంతా ఈ అసెస్మెంట్ ఇయర్ నుంచి తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని ప్రత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు(సీబీడీటీ) పేర్కొంది. గత రెండు సంవత్సరాల నుంచి రూ.5 లక్షల లోపు జీతం ఆదాయంగా ఉండి, బ్యాంకు వడ్డీ ఆదాయం రూ.10,000 దాటకపోతే ఐటీ రిటర్నులు దాఖలు నుంచి మినహాయింపునిచ్చారు. ఆ మినహాయింపు కేవలం 2011-12, 2012-13 అసెస్మెంట్ సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుందని, 2013-14కి అందరూ తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాల్సిందేనని సీబీడీటీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గత మే నెలలో రూ.5 లక్షల ఆదాయం దాటిన వారందరూ ఇక నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే రిటర్నులు దాఖలు చేయాలని పేర్కొన్న విషయం విదితమే. గత సంవత్సరం ఈ నిబంధన కేవలం రూ.10 లక్షల ఆదాయం దాటితేనే ఉండేది. ఇప్పుడు రూ.5 లక్షల ఆదాయం లోపు వారు ఆన్లైన్ ద్వారా కాని లేదా కాగితం రూపంలో కాని రిటర్నులు దాఖలు చేయవచ్చు.
ఇదివరకే పడివున్న అక్షరాల అడుగుజాడలలో తడబడుతూ నడుస్తూండేవే నీవీ నావీ, ఇంకా మనలాంటి వాళ్ళవే అందరివీ, జ్ఞాపకాలు.
Subscribe to:
Posts (Atom)
Address for Communication
-
దీపావళి అంటే దీపాల పంక్తి అని అర్థం – అందరికీ తెలిసినదే. కానీ , చిన్నారులు దీపావళి అంటే టపాసుల పండుగ అని అనుకున్నట్టే మధుపర్కం అ...
-
ఒకసారి పల్నాడు వెళ్లిన శ్రీనాధునికి మంచి నీళ్లు కావలసి వచ్చి తన ఇష్ట దైవం శివుణ్ణి ఇలా దబాయించాడట. సిరిగలవానికి చెల్లును తరుణులు పదియారు...
-
వాతావరణం చలిచలిగా , మబ్బుమబ్బుగా , స్తబ్దుగా ఉంది. ఇట్లాటి సమయాల్లో కవులు కవితలు రాస్తారు , నాకు మాత్రం - వేడివేడిగా మిర్చిబజ్జీలు ...