Pages

Tuesday, October 16, 2018

మతానికి డబ్బుకి ముడి పెట్టిన వాళ్ళెవరు?





                  గుడి కెళితే ,గుడికి వచ్చే భక్తులను,  sponsors గాను నాన్ sponsors గాను విడగొట్టి, వాళ్ళని వేరు వేరు వరసల్లో నిలిపేది ఎవరు?    
                                                            మన చేత  ధ్యానం చేయి౦చకుండ , పట్టుమని పది నిముషాలైన ప్రాణాయామం   చేయి౦చకుండనోటితో ఒక్క మంత్రం పలికించకుండా, ప్రార్ధన కానీ కనీసం గట్టిగ నమ్హ శివాయ అనిగానిగోవిందా.. గోవింద అని గాని అనిపించకుండాదృష్టంతా మన అర్చన , అభిషేకం, ప్రసాదాలపాకెట్లు,కళ్యాణం టికెట్ల మీద పెట్టెదేవరు?   మనం సేవల టికెట్స్ కొసం ఎదురు చూసి, ఒకరిద్దరు టికెట్స్ తెచ్చి ఇవ్వగానే పూజ మొదలు పెట్టేదెవరుమనకు గుడిలో ఒక్క మంత్రం ఏ పూజారైన  నేర్పాడ?  కనీసం ఏనాడైనా దేవుడికి  నైవేద్యం పెట్టడం ఎలాగో నేర్పారప్రతి చోట తొందర, పూజ తొందరగా ముగిసి పోవాలి, త్వరగా ఇంటికి వెళ్లి పోవాలి లేక సినిమాకు వెళ్ళాలి అని ఆలోచించే భక్తులు కూడా ఉన్నారు.  గట్టిగ అరగంట ధ్యానం లో కూర్చొనే ఓపిక ఉండే భక్తులు ఎంతమంది ఉన్నారువీళ్ళకి తగ్గట్టే, గుడిని కూడా బిజినెస్ గా మార్చి, భక్తులను ఆకట్టుకోవడానికి ఎన్ని ట్రిక్కులు! ఇక గుడికి వెళితే ప్రశాంతత ఎలా వస్తుంది

    నా మటకు నేను, ఒక అజ్ఞానిలా గుడికి వెళ్ళాలి, ఒక్క భక్తి తో మాత్రమే వెళ్ళాలి, ఎటువంటి రొక్కం లేకుండా దేవుడిని దర్శించుకోవాలి, తిరిగి గుడినుండి వచ్చేటప్పుడు, ప్రశాంతమైన మనసుతో రావాలి, నా ముఖంలో కొత్త విషయం నేర్చుకొన్నాను అన్న ఆనందం కలగాలి, నేను నేర్చుకొన్న విద్య మరోకరితో పంచుకోనేదిగా ఉండాలి, నాకు అవసరానికి అక్కరకు రావాలి.  ఇవన్ని జరిగే గుడి ఏమిటో మీకు తెలుసా? లేక మనమే సులువైన మార్గాలు ఎన్నుకొని, టికెట్ కొంటె చాలు, పుణ్యం వస్తుందనిమన మంచి చెడ్డలు పూజారి చూసుకొంటాడని  ఇలా అలవాటు పడ్డామ? లోపం వుందా? వుంటే వ్యవస్థ లోనా మనలోనా? ఎలా సరిచేసుకోవాలి.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681








No comments:

Post a Comment