Pages

Wednesday, August 08, 2018

చేపలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాయి. తిమింగిలాలు బ్యాంకుల్ని దోచుకుంటాయి.


             బ్యాంకులు ఇచ్చే రుణాలకు ఒక ‘సామాజికార్ధిక’ వర్గీకరణ వుంటుంది. బ్యాంకు ఖాతాదారుల్లో మూడు విభాగాలుంటాయి. మొదటిది పేదవర్గాలు. రెండోది మధ్యతరగతి వర్గాలు. మూడోది. వాణిజ్య సంస్థలు కార్పొరేట్లు.
             పేదవర్గాల బ్యాంకు అకౌంట్లు కేవలం లాంఛనమే. గ్యాస్ సబ్సిడీ, వృధ్ధాప్య పెన్షన్ మొదలయిన ప్రభుత్వ సహాయాన్ని పొందడానికే అవి వుంటాయి.
 వాణిజ్య సంస్థలు ,కార్పొరేట్లు ఎప్పుడూ బ్యాంకుల్లో డిపాజిట్లు చేయవు. అవి భారీ రుణాలను తీసుకుంటాయి.
          ఇక బ్యాంకుల్లో డిపాజిట్లు  చేసేది మధ్యతరగతి వర్గం మాత్రమే. మరో మాటల్లో చెప్పాలంటే చేపలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటాయి. తిమింగిలాలు బ్యాంకుల్ని దోచుకుంటాయి.
         బ్యాంకూ రుణాల ఎగవేతదారుల్లో విజయ్ మాల్య పేరు  ఈమధ్య ప్రముఖంగా వినిపిస్తోందిగానీ లక్షల కోట్ల రూపాయల మొండిబకాయిల ఖాతాల్లో అంబానీలు ఆడానీలు కూడా వుంటారు.
------------ ధరణికోట సురేష్ కుమార్,ఆడిటర్ పొన్నూరు@9441503681

No comments:

Post a Comment